DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లో భారత్ నెం 1 గా నిలిచింది   

విజ్ఞానాన్ని విద్యార్థి దశలోనే అందించాలి : 

ఏపీ సైన్స్ కాంగ్రెస్ లో గవర్నర్ హరిచందన్  

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం): . . .

.

శ్రీకాకుళం, నవంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌): శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు భారత దేశాన్ని ఉన్నత స్థితికి చేర్చిందాని, వాటిని విద్యార్థి దశ నుంచే

అందించాల్సిన భాద్యత ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం లోని ఎచ్చెర్ల బి ఆర్ ఏ  à°µà°¿à°¶à±à°µ విద్యాలయం లో 5à°µ రాష్ట్ర

సైన్స్ కాంగ్రెస్ ను  à°°à°¾à°·à±à°Ÿà±à°° గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రారంభించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్ ను శ్రీకాకుళం లో నిర్వహించడం ఆనందంగా

ఉందన్నారు. 

అనంతరం సైన్స్ కాంగ్రెస్ సావనీర్ ను గవర్నర్ ఆవిష్కరించారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు సాధించిన వారికి జ్ఞాపికలను

బహుకరించారు. 

పర్యావరణ అసమతౌల్యం భవిష్యత్తుకు వినాశకారిగా మారిందని, పెద్ద నగరాల్లో కాలుష్యం కుదిపేస్తుందని, దీన్ని అదుపు చేసేందుకు విస్తృతంగా

మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయం అవసరమని, సహజ సిద్ధమైన ఉత్పత్తులు రావాలని సూచించారు.  2.33 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం చేయుటకు

ముందుకు వచ్చినవారికి తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 

పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఎంతో ముందు చూపుతో  à°‡à°šà±à°šà°¿à°¨

అద్భుతమైన పిలుపు " జై జవాన్, జై కిసాన్ " నినాదం నేటికీ అమలు దాయకమన్నారు. భారత దేశం అణు శక్తి సామర్ద్యంగా దేశంగా తయారై, ప్రపంచ దేశాలకు గొప్ప సందేశాన్ని

ఇస్తోందని తెలిపారు.  

రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అభివృద్ధిలో శాస్త్ర విజ్ఞానం శీర్షికన సైన్స్ కాంగ్రెస్ జరగడం ఆనందంగా

వుందన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణ ప్రాంతంలో ఉందని, వ్యవసాయ రంగంలో వస్తున్న సవాళ్ళను పరిష్కరించుటకు శాస్త్ర విజ్ఞానం ఉపయోగపడాలని సూచించారు 

మూడు

రోజుల పాటు జరుగనున్న ఈ విద్య వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రహదారుల, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్,

విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కూన రాంజి, ఎన్ఆర్డిసి చైర్మన్ à°¡à°¾ పురుషోత్తం, ఏపి సైన్స్ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్  à°Žà°‚. వి.బసవేశ్వర రావు, శాసన సభ్యులు కంబాల

జోగులు, విశ్వాసరాయి కళావతి, విద్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam