DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రేపటి నుంచి విధుల్లో చేరండి . . ఆర్టీసీ సిబ్బంది కి పిలుపు

త్వరలోనే  à°•à°¾à°°à±à°®à°¿à°• వెల్ఫేర్ ప్రారంభిస్తాం. .

ప్రజల పొట్టలు నింపామే తప్ప ఎవరి పొట్టా కొట్టలేదు

మరణించిన వారి కుటుంబాలకి ఒక ఉద్యోగం ఇస్తాం.

 

మీడియా ముఖంగా తెలంగాణ సీఎం కేసీఆర్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌) : తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది

శుక్రవారం నుంచి యధావిధిగా విధుల్లోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన మంత్రివర్గ సమావేశం

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టమైన ప్రకటన చేసారు. ఇక నుంచి కార్మిక సంఘాలు ఉండవని, కార్మిక సంక్షేమ సంఘం మాత్రం ఉంటుందని, దానిలో ఇద్దరు

కార్మికులు సభ్యులుగాను, ప్రభుత్వ అధికారులతో కలిసి పని చేస్తారన్నారు. ఇకపై ప్రజా వ్యతిరేక పనులు చెయ్యవద్దని హెచ్చరించారు. దీంతో దాదాపు రెండు నెలలు

కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు à°šà°°à°® గీతం పాడినట్లైంది. 

అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల పొట్టలు నింపామె తప్ప, ఎవరి పొట్టా కొట్టలేదన్నారు. ఈ

ఉద్యమం పేరిట జరిగిన ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అయితే ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం చాల బాధాకరం

అన్నారు. 

కార్మికుల సమ్మె కాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వానికి సహకరించిన తాత్కాలిక సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు. త్వరలోనే వీరికి కూడా

తీపి కబురు చెప్తారేమో వేచి చూడాలి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam