DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకల్ జట్టుపై ఆంధ్ర ప్రభ జట్టు ఘన విజయం 

రసవత్తరంగా సాగుతున్న విజెఎఫ్ క్రికెట్ పోటీలు 

పోటీలు స్నేహ పూరిత వాతావరణంలోనే గంట్ల శ్రీనుబాబు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం

)

విశాఖపట్నం, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం పోర్ట్ మైదానం వేదికగా జరుగుతున్న సి à°Žà°‚ ఆర్ విజెఎఫ్ ఇంటర్ మీడియా క్రికెట్ పోటీల మూడవరోజు పోటీలు

రసవత్తరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్ లో లోకల్ టీవీ జట్టు పై ఆంధ్ర ప్రభ జట్టు 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. పోటీలు రెండు మైదానాల్లో

జరుగవలసి యుండగా, కారణాంతరాల వాళ్ళ పోర్ట్ మైదానం లో మాత్రమే నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్రతి మ్యాచ్ ను ప్రతి జట్టుకు 16 ఓవర్ల చొప్పున

నిర్వహిస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. శుక్రవారం ముందుగా బ్యాటింగ్ చేసిన లోకల్ జట్టు నిర్ణిత 16 ఓవర్లలో 92 పరుగులు చేసింది. దీనికి బదులుగా బ్యాటింగ్ చేసిన

ఆంధ్ర ప్రభ జట్టు ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించి ఘనవిజయం దక్కించుకుంది. దీంతో ఆంధ్ర ప్రభ జట్టు కెప్టెన్ గంట్ల

శ్రీనుబాబు, హర్షం వ్యక్తం చేసారు.

మ్యాచ్ అనంతరం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ పోటీలు పూర్తిగా స్నేహ పూరిత

వాతావరణంలోనే జరుగుతాయని, కేవలం పాత్రికేయుల్లో ఆహ్లాదాన్ని నింపడానికి మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ కమిటీ ఆధ్వర్యవం లో పాత్రికేయుల

సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. త్వరలోనే

అందించే అక్రిడై టేషన్ లు కూడా అందరికి లభించే విధంగా ప్రభుత్వ అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అందరికి న్యాయం జరగాలి అని ఆశిస్తున్నట్టు

తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam