DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చాకిపల్లి లో ఎన్ఆర్ఇజిఎస్ అవార్డుల కమిటీ పర్యటన

టెక్కలి మండలం లో ఉపాధి హామీ అమలు పై సర్వే

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°•à±‡à°‚ద్ర

ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద అవార్డుల ఎంపిక కు కేంద్ర ప్రభుత్వం నియమించిన అవార్డుల కమిటీ జిల్లా

పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాకిపల్లి గ్రామాన్ని సందర్శించింది. కమిటీలో డాక్టర్ అనురాధ, డాక్టర్ నీరజ్ మిశ్రా ఉన్నారు.

శుక్రవారం సాయంత్రం చాకిపల్లి చేరుకున్న కేంద్ర బృంద సభ్యులకు వేతన దారులు, ప్రజలు సంబంధిత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బృంద

సభ్యులు మాట్లాడుతూ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలలో తమ పర్యటన సాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనుల ప్రగతి,

నాణ్యత, జీవన విధానం మెరుగుదల తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా

వేతనదారుల తో ముఖాముఖి చర్చించి జాతీయ ఉపాధి హామీ పథకం పనులతో జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగైనవి అనే అంశాలను  à°¤à±†à°²à±à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°°à±. ఎన్ ఆర్ à°ˆ జిఎస్ పనులు వల్ల వలసలు

తగ్గాయని, ఉపాధి హామీ పనులతో పంట పొలాలకు వెళ్లేందుకు రహదారి నిర్మాణం వలన  à°•à°¾à°¯à°—ూరలు సాగు చేసుకొని దినసరి ఆదాయం రూ.700వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. సొంత

ఊరిలోనే ఆత్మస్థైర్యంతో జీవిస్తూ ప్రమాణాలు మెరుగు చేసుకున్నామని వేతనదారులు బృందానికి తెలియజేశారు. అలాగే వ్యవసాయానికి అనుబందంగా ఉపాధిహామీ పనులు

కల్పించాలని కోరారు. అంతకు ముందు ఉపాధిహామీ పథకం జరిగిన పలు అభివృద్ధి పనుల ఛాయా చిత్రాలను పరిశీలించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించి విద్యార్థినిలతో

వాలీబాల్     ఆటలో పాల్గొని ఉత్తేజపరిచారు. అనంతరం బృంద సభ్యులు చాకిపల్లి పంచాయతీ పరిధిలో ఎన్.ఆర్.à°‡.జి.ఎస్ పథకం à°•à°¿à°‚à°¦ చేపట్టిన గ్రావెల్ రోడ్లు, సిసి రోడ్లు, ఫారం

పాండు, ఆట స్థలాలు, పాఠశాల ప్రహరీ నిర్మాణాలు పరిశీలించి సంతృప్తి చెందింది. చాకి పల్లి లో సగటు వేతనం 189 రూపాయలు రావడం పట్ల బృందం సంతోషాన్ని వ్యక్తపరచింది.

   

ఈ పర్యటనలో డ్వామా పథక సంచాలకులు హెచ్ కూర్మారావు, సంచాలకులు, ఏ పీ ఓ బి ప్రసాదరావు, ఎంపీడీవో హెచ్ ఐ వి రమణ మూర్తి, తహసిల్దార్ శ్రీరామ్ మూర్తి తదితరులు

పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam