DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజెఎఫ్ క్రికెట్. .: సెమిస్ కు చేరిన ఆంధ్ర ప్రభ 

ఓబి జట్టు పై  9 వికెట్ల ఘన విజయం 

ఆకట్టుకున్న శ్రీనుబాబు అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 30, 2019

(డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం పోర్ట్ మైదానం వేదికగా జరుగుతున్న సి à°Žà°‚ ఆర్ విజెఎఫ్ ఇంటర్ మీడియా క్రికెట్ పోటీల్లో ఆంధ్ర ప్రభ జట్టు సెమి ఫైనల్ కు చేరుకుంది. శనివారం

ఉదయం జరిగిన మొదటి మ్యాచ్ లో à°“ బి జట్టు పై ఆంధ్ర ప్రభ జట్టు 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది.  

ముందుగా బ్యాటింగ్ చేసిన ఓబీ జట్టు నిర్ణిత 16 ఓవర్లలో 73 పరుగులు

చేసింది. ఆంధ్ర ప్రభ జట్టు లో గోవింద్ 4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, శ్రీనివాస రావు 1 ఓవర్లో 1 పరుగు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. ఆంధ్ర ప్రభ జట్టు నాయకుడు

గంట్ల శ్రీనుబాబు అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనపరిచాడు. ఫీల్డింగ్ లో డైరక్ట్ త్రో ద్వారా à°’à°• బ్యాట్స్ మాన్ ను రన్ అవుట్ చేసారు.   

దీనికి బదులుగా

బ్యాటింగ్ చేసిన ఆంధ్ర ప్రభ జట్టు ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం 1 వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఛేదించి ఘనవిజయం దక్కించుకుంది. జట్టులో ముకేశ్ 47 పరుగులు

నాటౌట్ తో జట్టును విజయాపదంలోకి ఒంటిచేత్తో నడిపించాడు. 

మ్యాచ్ అనంతరం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ పోటీలు

పూర్తిగా స్నేహ పూరిత వాతావరణంలోనే జరుగుతాయని, కేవలం పాత్రికేయుల్లో ఆహ్లాదాన్ని నింపడానికి మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ కమిటీ ఆధ్వర్యవం లో

పాత్రికేయుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు.

త్వరలోనే అందించే అక్రిడై టేషన్ లు కూడా అందరికి లభించే విధంగా ప్రభుత్వ అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అందరికి న్యాయం జరగాలి అని

ఆశిస్తున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam