DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల ను బ్రష్టుపట్టించేందుకు మిషనరీల కుట్ర?

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు యేసయ్య బోర్డుల మార్చేశారు. . .. 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వెబ్ లో క్రైస్తవ ప్రచారం పై సాధు పరిషత్ ఆగ్రహం 

ఏకాదశి 10 రోజులు చేస్తారా ? . . .

టిటిడి ని తక్షణం

రద్దు చెయ్యాలి : శ్రీనివాసానంద సరస్వతి ...

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, డిసెంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీవేంకటేశ్వరుని ప్రతిష్టకు

భంగం కల్గించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగు చూస్తున్న ఎన్నో అభ్యంతరకర అంశాల దృష్ట్యా తక్షణం టిటిడి బోర్డును రద్దు చెయ్యాలని ఉత్తరాంధ్ర సాధు

పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేసారు. ఆదివారం నగరం లోని గ్రేటార్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జీవీఎంసీ)  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ ఎదురుగా

గల గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిటిడి వెబ్ సైట్ లో క్రైస్తవ మతప్రచారం కు సంబంధించిన వ్యాఖ్యలు, పాటలు

చేర్చడం పూర్తి గా అభ్యంతరకరం అన్నారు. పవిత్ర తిరుమల క్షేత్రాన్ని బ్రష్టుపట్టించేందుకు క్రైస్తవ మిషనరీల కుట్ర దాగి వుందనే అనుమానాలు వీరి చేష్టల ద్వారా

మరింత బలపడుతోందన్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్టు ఏసయ్య బోర్డులా మారిందని, ప్రసుత్తం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో 800 మంది à°•à°¿ పైగా  à°•à±à°°à±ˆà°¸à±à°¤à°µà±à°²à± ఉద్యోగం చేస్తూ. .  à°¤à°¾à°®à± ఎక్కడ ప్రతి నెలా వేలాది

రూపాయల జీతం తీసుకుంటున్నారో అదే వెంకటేశ్వర స్వామిని దారుణంగా తిడుతూ, దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది తెలిసిన నాటి చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుభ్రమణ్యం

తక్షణం క్రైస్తవ మతస్తులు టిటిడి నుంచి స్వచ్చందంగా వైదొలగాలని హెచ్చరించడంతో ఏకంగా ఆయన్నే పదవి నుంచి తొలగించడం చూస్తే సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే

టిటిడిలో క్రైస్తవ మతప్రచారానికి పూనుకుందని నిరూపితమవుతోందని మండిపడ్డారు. తక్షణం టిటిడిలోని క్రైస్తవ మతస్తులను ఉద్యోగం నుంచి బయటకు పంపాలని, లేని పక్షంలో

ఉద్యమిస్తామని హెచ్చరించారు.  
తిరుమల హుండీ లో కోట్లాది మంది హిందువులు స్వామికి ఇచ్చే ముడుపులు అని, వాటిని క్రైస్తవ మత పోస్టర్లకు, ముస్లిం మత ఇమాములకు నెలసరి

జీతాలిస్తారా అని మండిపడ్డారు. 

దీనికి నిదర్శనంగా టిటిడి చేస్తున్న పనులు కోట్లాది మంది హిందువులకు ఆగ్రహాన్ని తెస్తోందన్నారు. లడ్డూల ధర లు పెంచారని,

అద్దెగదుల ధరలను రెట్టింపు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. భక్తులకు ఆర్ధికభారాన్ని మోపి ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది. హిందూధర్మానికి

విఘాతం కలుగుతున్నా ఇతర పీఠాధిపతులు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. 

ఏకాదశి 10 రోజులు చేస్తారా ? . . . . 

అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి  à°°à±‹à°œà± ను పది

రోజులకు పొడిగించడం ఆగమ విరుద్దమని టిటిడి పెద్దలకు , పీఠాధిపతులకు తెలీదా, మరి దీన్ని ఎవరూ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. త్వరలో హిందూమత పెద్దలందర్నీ

ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, దీనిపై పూర్తి స్థాయి చర్చ జరిపి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. 

అనంతరం కోట్లాది మంది హిందూ భక్తుల

మనోభావాలు దెబ్బతీస్తున్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మోకాళ్ళ పై నిలబడి నిరసన వ్యక్తం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam