DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాఠశాలల గదులా అగ్ని గూండాలా ?  సెలవులు పొడిగించాల్సిన అవసరం లేదా

మంత్రి à°•à±€, అధికారులకూ పట్టింపు లేదా  ..

పై కప్పులేని స్కూళ్ళు ఎన్నో . . ..  

విశాఖపట్నం, జూన్ 18  2018 (DNS Online ) :  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ లో సూర్య తాపం అధికంగా ఉన్నందున నగర ప్రజలు à°ˆ

ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ నాటికి ఎండ తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు సామాన్య స్థితికి వస్తుంటాయి. గత ఏడాది నుంచి జూలై మొదటి

వారానికి గానీ ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి రావడం లేదు. విద్యా శాఖ వేసవి కాలం లో విద్యార్థులకు ఎండ ప్రభావం ఉండకూడదు అనీ, వేసవి తాపం తగలకూడదని సెలవలు ఇచ్చేది.

అయితే అదేదో షెడ్యూల్ లాగా జూన్ 12  à°¨à±à°‚à°šà°¿ తిరిగి పాఠశాలలు ప్రారంభం అని కొనసాగించడంలో అర్ధం ఏంటి ? à°ˆ పరిస్థితుల్లో పాఠశాలల్లో తరగతులు కొనసాగిస్తే. . . ఎండవేడికి

విద్యార్థులు ఏ విధంగా తట్టుకుంటారూ అనే కనీసం ఇంగితం కూడా విద్యాశాఖకు లేక పోవడం దురదృష్టకరం. గత ఏడాది తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఒక వారం రోజులు సెలవలు

ప్రకటించిన విద్య శాఖ, ఈ ఏడాది కనీసం పట్టించుకునే స్థితి లో లేదు. దీనిపై పాఠశాలలు కూడా కనీసం స్పందించడం లేదు, పైగా, ఇదేదో తమకు సంబంధించని విషయం లా భావించి,

తరగతులను ఎండల్లోనే కొనసాగించడం దారుణం. విద్యార్థుల నుంచి లక్షలాదిగా రూపాయల ఫీజులను వసూలు చేసే విద్య సంస్థలు కనీసం విద్యార్థులకు ఎటువంటి వసతులూ

కల్పించకపోవడం తో తరగతి గదులు కూడా అగ్నిగుండాలుగా మారి పోయినా పట్టించుకోవడం లేదు. 

ఏ సి గదుల్లో ఉద్యోగాలు చేస్తూ . . . . ఎండల్లో తరగతి గదుల్లో చదువుకునే

విద్యార్థుల బాగోగులు పట్టించు కోకుండా తమకు తోచిన నిర్ణయాలు తీసుకునే విద్యాశాఖ అధికారులకూ, ఈ విద్యా శాఖ అధిపతిగా ఉన్న రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి కి సైతం

పట్టింపు లేకపోవడం చాలా దురదృష్టకరం. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచీ, ఫిర్యాదులు వచ్చే వరకూ మంత్రి, అధికారులూ, ఈ వేసవి సమస్యపై పటిష్టమైన నిర్ణయాలు

తీసుకోవాల్సియుండగా, వారు తమ భాద్యతలను పూర్తిగా విస్మరించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల జీవితాల పై జీవో లు పాస్ చేసేవారు, తాము నివసిస్తున్న ఏసీ గదులను వీడి,

తాము తిరిగే ఏసి కార్లను వదిలి సామాన్యుల మాదిరిగా రోడ్లపైకి వఛ్చిన నాడు, విద్యార్థులు పడుతున్న అవస్థలు తెలుస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు

హెచ్చరిస్తున్నారు. విద్య విధానం పూర్తిగా బ్రష్టు పట్టిందని , దీన్ని ప్రక్షాళన చెయ్యవలసిన అవసరం ఉందని మండిపడుతున్నారు. 
వాతావరణ శాఖ రాష్ట్రం లో కలిగే

ఉష్ణోగ్రతలపై పూర్తి హెచ్చరికలు జారీ చేసినా విద్యా శాఖ అధికారులు పట్టించుకోలేదంటే ఏమనుకోవాలి. వీళ్ళకి విద్యార్థుల పట్ల భాద్యత ఉందా లేదా ?

విద్యార్థులు

బలవ్వలసిందేనా ? 

అధికారులు తీసుకునే భాద్యతారాహిత్య నిర్ణయాల వల్ల ఎందరో విద్యార్థులు బలవుతున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతల తాపాన్ని తట్టుకోలేక విద్యార్థులు

మృత్యువాత పడుతున్నారు. ప్రతిష్ఠాత్మక స్కూళ్ళు గా ప్రచారం చేసుకుని లక్షలాది రూపాయలు ఫీజుల రూపం లో వసూలు చేసే స్కూళ్ల యాజమాన్యాలు కూడా

కళ్ళుమూసుకుపోయినట్టుగానే ఉన్నాయి. ఎండలు తగ్గే వరకూ స్కూళ్లకు సెలవలు ప్రకటించినట్టయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కొంత ఊరట కల్గుతుంది. కార్పొరేట్

స్కూళ్లే ఇలాగ ఉంటె ప్రభుత్వ పాఠశాలల తీరు మరింత ఘోరంగా ఉంది. చాలా స్కూళ్లల్లో తరగతి గదులకు పై కప్పులు సరిగ్గా ఉండడం లేదు, ఉన్న ఎండ వేడి తీవ్రంగా క్రిందకి

దిగుతుంది. అదే వేడిలో ఇటు పిల్లలూ ఉండాలి, అటు అధ్యాపకులూ ఉండాలి. గతం లో ఉన్నట్టు గా ఏ పాఠశాల లోనూ చెట్లు లేవు, అంతామైదాన ప్రాంతమే. దీంతో అక్కడ చదివే వారికి

నిలువ నీడ లేకుండా పోతోంది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam