DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిశ’ ఉదంతంపై నిర్భయ తల్లి ఆవేదన

సత్వర శిక్షలు అమలు చెయ్యాలని ఎంపీల సూచన  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 02, 2019 (డిఎన్‌ఎస్‌) : ‘దిశ’ హత్యోదంతంపై

దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిందితుల్ని వెంటనే శిక్షించాలంటు సమాజం ముక్తకంఠంతో కోరుతోంది. 2012లో దిల్లీలో ఇదే తరహా దాడికి గురై ప్రాణాలొదిలిన నిర్భయ

తల్లి  à°¤à°¾à°œà°¾ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని à°’à°• పాశవిక చర్యగా ఆమె అభివర్ణించారు. నిర్భయ  à°µà°¿à°·à°¯à°‚లో ఏడేళ్ల నుంచి పోరాటం చేస్తున్నట్లు.. దిశ విషయంలో జరగొద్దని

ఆకాంక్షించారు. వెంటనే నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఆవేదనని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని

డిమాండ్‌ చేశారు.  

ప్రస్తుతం శంషాబాద్‌లో జరిగిన దిశ హత్యోదంతం తరహాలోనే 2012 డిసెంబర్‌లో నిర్భయ à°…న్యాయానికి  à°—ురైన విషయం తెలిసిందే. అయితే నిర్భయ ఘటనలో

విచారణ పూర్తి కావడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది. 2017లో వారికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికీ శిక్ష అమలు చేయలేదు. వెంటనే వారిని

ఉరితీయాలని నిర్భయ తల్లి పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా నిర్భయ అత్యాచార కేసు నిందితుల్లో ఒకడైన వినయ్‌ శర్మ చేసుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను

తిరస్కరించాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అనిల్‌ బైజాల్‌కు దిల్లీ ప్రభుత్వం గట్టిగా సిఫార్సు చేసింది. దిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆశాదేవీ

అభినందించారు. అదే తరహాలో శిక్ష కూడా వెంటనే అమలయ్యేలా కృషి చేయాలని కోరారు.

అటు పార్లమెంటులోనూ దిశ ఉదంతంపై నేడు విస్తృత స్థాయి చర్చ చేపట్టారు. ఇలాంటి

ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సభ్యులంతా అభిప్రాయపడ్డారు. ఘటనను పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం

చేయాలని డిమాండ్‌ చేశాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam