DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక నుంచి రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ తక్షణం అమలు. 

స్టేషన్ పరిధి కాకున్నా ఫిర్యాదు నమోదు  à°•à±‡à°¸à± పెట్టొచ్చు.. 

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ సంచలన ప్రకటన  

పోలీస్ స్టేషన్ల అనుసంధానం పై  DNS  à°•à°§à°¨à°‚ కు స్పందన

:

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, డిసెంబ‌రు 02, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్‌ఐఆర్‌ అమలు చేయాలంటూ డీజీపీ  à°—ౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు

రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  . జీరో ఎఫ్‌ఐఆర్‌ అమల్లో ఉంటే.. పోలీసు స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు

స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్‌ఐఆర్‌లో అవకాశముండదు. జీరో ఎఫ్‌ఐఆర్‌ పేరిట

బాధితులు ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేస్తే.. దానిని స్వీకరించి.. విచారణ జరిపి.. సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి

ఉంటుంది. తద్వారా ఫిర్యాదు చేసే బాధిత కుటుంబాలకు భరోసా లభిస్తుంది. 

పోలీస్ స్టేషన్ల అనుసంధానం పై  DNS  à°•à°§à°¨à°‚:. . . 

బాధిత కుటుంబాలకు భరోసా లభించే విధంగా

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లనూ అనుసంధానం చెయ్యాలని రెండు రోజుల క్రితం DNS వార్తా కధనం ద్వారా ప్రభుత్వానికి, పోలీసు శాఖా కు సూచించడం జరిగింది.

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో ఏకీరుతం చేసే యోచన చెయ్యాలని కధనం వ్రాయడం జరిగింది. 
అయితే సత్వర నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జీరో ఎఫ్ ఐ ఆర్

ను తక్షణం అమలు చెయ్యాలని రాష్ట్ర డిజిపి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.   

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam