DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు అమరావతి పర్యటన లో దాడి పై గవర్నర్ కి పిర్యాదు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 03, 2019 (డిఎన్‌ఎస్‌) : ఇటీవల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అమరావతి పర్యటన సందర్బంగా జరిగిన దాడిపై

తెలుగుదేశం ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగా శాసన సభ పక్ష ఉప నాయకుడు కె. అచ్చింనాయుడు మాట్లాడుతూ రాజధాని పై

సీఎం, అతని మంత్రులు 6నెలలుగా అవాస్తవాలు చెప్తూ వచ్చారని, ప్రభుత్వం అవాస్తవాలు చెప్తోందని చాటేందుకే అమరావతిలో చంద్రబాబు పర్యటించారని తెలిపారు. బాబు పర్యటన

లో గందర గోళం చేస్తారనే ముందస్తు సమాచారం పోలీసులకు ఉన్నా వైసీపీ రౌడీలు దాడికి దిగారని, పోలీసుల కుట్రతోనే చంద్రబాబు పై దాడి జరిగిందని మండిపడ్డారు. బయట నుంచి

తీసుకొచ్చిన రౌడీలతోనే వైసీపీ దాడి చేయించిందని, పోలీసులు ఉసిగొలపటం వల్లే చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగిందని గవర్నర్ కు ఫిర్యాదు చేశామని

తెలిపారు. 

కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజధాని మహిళను అరెస్టు చేసి అన్ని పోలీస్ స్టేషన్ లు తిప్పుతున్నారని, బాధ చెప్పుకున్న మహిళను అరెస్టు

చేయడం దారుణం న్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని పై అసభ్య పదజాలం వాడిన కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదని

ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన లో వాడిన బస్సులను సీజ్ చేసి డ్రైవర్ కండక్టర్ లను అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పూర్తిగా కక్ష

సాధింపే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, గవర్నర్ వాస్తవాలు గ్రహించారు, మా ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam