DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక వెంకన్నకు పుత్తడి కిరీటం బహుమానం 

విశాఖపట్నం, జూన్ 18 , 2018 (DNS Online ) : ఉత్తరాంధ్ర జిల్లాల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఉపమాక గ్రామం లో వేంచేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి కి అనకాపల్లి పట్టణానికి చెందిన మళ్ళ

అప్పలనాయుడు, లక్ష్మీ ఉషారాణి దంపతులు బంగారు కిరీటం బహూకరించారు. మండలంలోని ఎన్.నర్సాపురం గ్రామంలో గల వరాహ ఆక్వా ఫార్మ్స్ భాగస్వామి అయిన అప్పలనాయుడు

కుటుంబానికి ఉపమాక వేంకటేశ్వర స్వామి ఇలవేల్పు కావడంతో స్వామివారి ఉత్సవమూర్తులలో భూదేవి అమ్మవారికి 46.500గ్రాములు గల బంగారు కిరీటాన్ని సమర్పించారు. దీనికి

సంబందించి సుమారు రూ,,1,60,000/- లు వ్యయం చేసినట్టు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా ఉదయం గం,,11-15ని,,లకు అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. మొక్కుబడులు చెల్లించిన అనంతరం

ఆభరణాలకు ముందుగా విష్వక్సేన పూజ నిర్వహించి, పుణ్యాహ వాహనం జరిపి, తదుపరి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ దేవాలయమును

స్వాధీనం చేసుకున్న తరువాత జరిగిన మొట్టమొదటి కళ్యాణ ఉత్సవములలో గ్రామానికి చెందిన దేవాదాయశాఖ మాజి కార్యనిర్వహణాధికారి రంగనాధస్వామి వీరి సోదరుడు ఉపమాక

దేవస్థానం ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు కలసి ౪౨ గ్రాముల గల సుమారు 1,10,000/-ల విలువైన బంగారు కిరీటాన్ని స్వామి వారి ఉత్సవమూర్తులలో శ్రీదేవి

అమ్మవారికి ఇవ్వడం జరిగింది. దానిని కూడా ఈరోజు శుధ్ది చేసి అమ్మవార్లకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాసులు, ఇల్లింద

గోపాలాచార్యులు, నండూరి రంగాచార్యులు, బి.హెచ్.గోపాలాచార్యులు, సిబ్బంది గిరికుమార్, రాజశేఖర్, మహేష్, శ్రీనివాస భక్తసమాజం సభ్యులు నున్న సుభాష్, వేంకటేశ్వర రావు

మళ్ళ కాశీవిశ్వనాధ్,కర్రి దివాకర్, యల్లపు రమణ తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam