DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శిక్షలు తక్షణం అమలయ్యేలా చట్టాలు కఠినతరం చెయ్యాలి  

హైదరాబాద్ దిశా సంఘటన దురదృష్టకరం : మంత్రి ధర్మాన 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 03, 2019 (డిఎన్‌ఎస్‌):

హైదరాబాద్ లో జరిగిన దిశా ఘటన చాల దురదృష్టకరమని, తక్షణం అమలయ్యేలా చట్టాలు మరింత కఠినంగా ఉండాలని రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

మంగళవారం శ్రీకాకుళం నగరం లోని ప్రభుత్వ గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాల లోని లోపాలని ఈ సంఘటన తెలియజేస్తుందన్నారు. ఇలాంటి

ఘటనలు ఇంకెక్కడా పునరావృతం కారాదన్నారు. కాలానుగుణంగా మారుతున్న నేరాల దుష్ట్యా చట్టాల్లో మార్పులుతేవాలన్నారు. తక్షణం రాష్ట్రం లో జీరో ఎఫ్ ఐ ఆర్ అమలు చేయడం

జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలకు అధికార యంత్రాంగం à°…à°‚à°¡à°—à°¾ ఉండాలని సూచించారు. 

మహిళలకు సంపూర్ణ భద్రత ఉండాలని, దీనికి

సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపడతాం అని తెలియచేసారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 
మహిళలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తప్పులు ఎవరు చేసినా వెలికి తీయాలని మీడియా ద్వారా కోరుతున్నారు. అసాంఘిక శక్తులను వదిలి పెట్టారాదని, చట్ట పరిధిలో కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.

భవిష్యత్తులో మరింత పారదర్శకంగా ఆదర్శంగా ప్రభుత్వం ఉంటుందన్నారు. 

ప్రతి అర్హుడు సంక్షేమ పథకాలు అందుకోవాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఒక ప్రశ్నకు

బదులుగా చెప్పారు.  à°œà°¿à°²à±à°²à°¾ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి మాట్లాడుతూ కళాశాలలు ఇతర ప్రదేశాల్లో అన్ని ఆవాహన, భద్రతా చర్యలు చేపడతాం అని తెలిపారు. ఆపదలో ఉన్న వారు

తక్షణం 100 కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసు వ్యవస్థ స్పందింస్తుందన్నారు. ఈ సమయసంలో జాయింట్ కలెక్టర్ డా కె. శ్రీనివాసులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam