DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ ని చూడగానే ఆనంద బాష్పాలు వచ్చాయి: 

ఉత్తరాంద్ర కన్నీళ్లు హిందీ ప్రతి ప్రధాని మోడీ చే ఆవిష్కరణ . .

ఉత్తరాంధ్ర పాత్రికేయునికి ప్రధాని అభినందనలు 

ఒలింపిక్ బంగారు పతకం సాధించినంత

ఆనందంగా. . . .

3 నిమిషాల్లో 3 శతాబ్దాల వెనుకబాటు, వ్యధ వివరించా. .

న్యూ ఢిల్లీ నుంచి డిఎన్ఎస్ తో ఎన్ఎన్ఆర్ వెల్లడి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం) :  . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 04, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రపంచంలో అత్యంత ఆదరణ కల్గిన నేతల్లో అగ్రగణ్యులు, భారత ప్రధాని నరేంద్ర మోడీ ని చూడగానే ఒక్కసారి ఆనంద బాష్పాలు

వచ్చాయని జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి, ఎన్ ఎన్ ఆర్ తెలిపారు. 
విశాఖపట్నం కు చెందిన ఎన్ఎన్ఆర్ గా ప్రసిద్దిగాంచిన నాగనబోయిన నాగేశ్వర రావు బుధవారం న్యూ

ఢిల్లీ లో ప్రధాని మోడీని కలిసి శతాబ్దాల ఉత్తరాంద్ర వెనుకుబాటు తనంపై తానూ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ ఉత్తరాంధ్ర కన్నీళ్లు హిందీ అనువాద ప్రతిని 
 à°†à°¯à°¨à°•à± అందించారు. à°ˆ

సందర్బంగా న్యూఢిల్లీ నుంచి DNS కు ఆయన తన స్పందన తెలియచేసారు. భారత పార్లమెంట్ భావంలో ఆయన్ను కలిసేందుకు కేవలం మూడు నిమిషాల సమయం ఇచ్చారని, ఈ సమయంలోనే మూడు

శతాబ్దాల ఉత్తరాంధ్రా  à°µà±†à°¨à±à°•à±à°¬à°¾à°Ÿà± తనాన్ని ఆయనకు వివరించినట్టు తెలిపారు. 

ప్రధాని మోడీ చే హిందీ అనువాదం ఆవిష్కరణ  : . . . .

ఈ క్రమంలో తానూ రెండున్నరేళ్ల

పాత్రికేయ రంగ అనుభవం తో ప్రత్యక్షంగా చవి చూసిన ఉత్తరాంధ్ర నీటి వనరులు, నీటి ప్రాజెక్టులు, సమస్యలు, పరిష్కార, మార్గాలు, ఉత్తరాంద్ర స్థితిగతులకు అక్షర రూపం

కల్పించినట్టు తెలిపారు. దానికి హిందీ అనువాదం కూడా ముద్రించి, à°¦à°¾à°¨à±à°¨à°¿ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారన్నారు. ఆయన à°ˆ పుస్తకాన్ని పూర్తిగా తానె

స్వయంగా చదివుతానని తెలిపారు. 

భారత ప్రధానమంత్రిని తానూ ఎన్నడూ ప్రత్యక్షంగా కలిసి, మాట్లాడతాననని కలలో కూడా అనుకోలేదని, అలాంటిది స్వయంగా రచించిన

పుస్తకాన్నే ప్రధాని మోడీ కి అందించే అవకాశం రావడం ఒలింపిక్ పోటీల్లో బంగారు పతకం సాధించినంత ఆనందంగా ఉందన్నారు. ఈయన క్రీడా పాత్రికేయుడు కావడం

గమనార్హం. 

మోడీని కలిసిన క్షణం : . . . 

బుధవారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ప్రధానిని కలిసేందుకు అనుమతి లభించిందని, ఆ సమయం ఎంతో ఉద్వేగంగా ఉందని, నెమ్మదిగా

అడుగులు వేస్తూ పార్లమెంట్ భవనం లో ప్రధాని ఉన్న గదివైపు అడుగులు వేసానన్నారు. అన్ని భద్రతా పరీక్షలు ముగిశాక లోనికి వెళ్తే. . . .  à°ªà±à°°à°ªà°‚à°šà°‚ రెడ్ కార్పెట్ పరిచి

స్వాగతం పలికే అత్యంత శక్తివంతమైన భారత దేశాధినేత నరేంద్ర మోడీ ఒక్కసారిగా ఎదురుగా కనపడగానే . . . అమాంతం కన్నీళ్లు ఆనంద బాష్పాలు రూపంలో వచేశాయని, నోటివెంట మాట

రాలేదన్నారు.  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à°¿ చూసిన ప్రధాని స్వాగతం పలికి, ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఎంతో ఆశ్చర్యాన్ని కల్గించిందని ఎన్ ఎన్ ఆర్ గద్గద స్వరంతో

తెలిపారు. 

అధికార, ప్రతిపక్ష ఎంపీ లు, ఇతర జాతీయ స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఉత్తరాంధ్రా వెనుకబాటు తనాన్ని గురించి, ఇక్కడ ప్రజలు

పడుతున్న అవస్థలను ప్రధాన మంత్రి దృష్టి కి ఎంతవరకూ తీసుకువెళ్లారు అన్నది తెలియదన్నారు. అయితే బుధవారం డిసెంబర్ 4 ,2019 ఉదయం 11 :16 నిమిషాలకు ఉత్తరాంధ్ర ప్రజల కన్నీటి

గాధలను తాను స్వయంగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లగలిగానన్నారు. 

ప్రధానిని కలిసే మధురక్షణాలు కల్పించిన అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, పబ్లిషర్ చాంద్

మాల్ అగర్వాల్ లకు కృతజ్ఞతలు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam