DNS Media | Latest News, Breaking News And Update In Telugu

50 ఏళ్ళ ప్రభుత్వ పాఠశాల విశాఖ ఎంసిహెచ్ ప్రయాణ పండుగ

50 ఏళ్ళ ప్రభుత్వ పాఠశాల ప్రయాణ పండుగ 

8 à°¨ విశాఖ న్యూకొలని à°Žà°‚ సి హెచ్ స్కూల్ వేడుకలు 

పూర్వ విద్యార్థులూ కదిలి à°°à°‚à°¡à°¿ - కలిసి నడుద్దాం: 

పూర్వ

విద్యార్థులందరికి ఆహ్వానం.: ఆహ్వాన కమిటీ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 05, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రభుత్వ పాఠశాలలకు మనుగడే

కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ పాఠశాల 50 ఏళ్ళు ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం సర్వత్రా హర్షణీయంగా మారింది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్

కార్పొరేషన్ ( జీవీఎంసీ) పరిధిలోని న్యూ కోలనీ లో గల మునిసిపల్ పాఠశాల ( ఎం సి హెచ్) ఈ నెల 8 నాటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని

వేడుకలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల వేడుకల కమిటీ చైర్మన్ టి. కరుణాకర్ తెలిపారు. గురువారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు

విద్య అందించి, ఉన్నత హోదాల్లో ఉండడానికి కారణమైన సంస్థ అభ్యున్నతికి తమ వంతు కృషి చెయ్యాలనే సంకల్పనతో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.1969 లో

ప్రారంభమైన ఈ విద్య సంస్థ నుంచి పదవ తరగతి పూర్తి చేసుకుని నేడు దేశ, విదేశాల్లో ఎంతో ఉజ్వల స్థితిలో ఉన్నారన్నారు. ఎందరో ఉపాధ్యాయులుగాను, పాత్రికేయులు గాను,

పారిశ్రామిక వేత్తలుగాను, శాస్త్రవేత్తలుగాను, విశ్వ విద్యాలయాల ఉప కులపతులుగాను, ఐఏఎస్ లు గాను ఎంతో ఉన్నత హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆరోజున

వేడుకల్లో వీరందరూ పాల్గొనున్నట్టు తెలిపారు. ఈ సంస్థ లో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొనాలని

పిలుపునిచ్చారు.

పూర్వ విద్యార్థులూ కదిలి రండి - కలిసి నడుద్దాం: . . . .

పూర్వ విద్యార్థులు తమ వివరాలను కమిటీ ప్రతినిధులకు అందించాల్సిందిగా కోరుతున్నారు.

ప్రత్యక్షంగా హాజరయ్యే వారు, హాజరుకాలేని విద్యార్థులందరూ మీ మీ ప్రస్తుత వివరాలను స్వర్ణోత్సవ కమిటీ సభ్యులకు అందించవలసిందిగా కోరుతున్నారు. ఫోన్ ద్వారా,

వాట్సాప్ ద్వారా, పేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించాల్సిందిగా కోరుతున్నారు. విద్యార్థులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 98482 92532 ,

విక్రమ్ (98481 37445 ), సురేష్  (7013807780 ) లను సంప్రదించవచ్చు.       
 
వేడుకల్లో భాగంగా నాటి ఉపాధ్యాయులను, పెద్దలను సాదర పూర్వకంగా సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ

కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన, జిల్లా పోలీసు అధికారి చిట్టిబాబు ( ఈ విద్యాలయ పూర్వ విద్యార్థి),

జిల్లా విద్యాశాఖాధికారి లింకేశ్వర రెడ్డి, తదితరులు హజరవుతున్నట్టు తెలిపారు.  

ఈ విలేకరుల సమావేశంలో స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్ గురు గోవింద్ సింగ్,

కార్యదర్శి ఎల్. కోటేశ్వర రావు,  à°¸à°‚యుక్త కార్యదర్శి ప్రముఖ నాట్య కళా సంస్థ నటరాజ్ డాన్స్ అకాడమీ చైర్మన్ బి. విక్రమ్, యామిని, సీనియర్ పాత్రికేయుడు సురేష్ (4 టివి),

తదితరులు పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ ను విడుదల చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam