DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిసిసిబి పర్సన్ ఇంచార్జి గా విక్రాంత్ బాధ్యతలు స్వీకరణ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 05, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ( డిసిసిబి )

కార్యాలయంలో పర్సన్ ఇంచార్జి (చైర్మన్) గా పాలవలస విక్రాంత్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ

దాస్, శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు హాజరయ్యారు. డిసిసిబి ని జిల్లాలో అగ్రగామి బ్యాంక్ గా తీర్చిదిద్దుతామని విక్రాంత్ అన్నారు. ఛైర్మన్ గా

నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. వై యస్ రాజశేఖర రెడ్డి హయాంలో సహకార రంగానికి మంచి తోడ్పాటు అందిందని

పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి చేరువ అవుతామని అన్నారు. 

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలో 6 నూతన బ్యాంకు శాఖలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని, 18 ఏటిఎంలు పనిచేస్తూ

ప్రజలకు మంచి సేవలు అందిస్తుందన్నారు. 

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ డిసిసిబి 1936లో ఏర్పాటు అయిందన్నారు. బ్యాంకును

బలోపేతం చేయాలని, అందుకు పూర్తి తోడ్పాటు అందిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తూ వ్యవస్థను బలోపితం చేస్తున్నారని తెలిపారు. 
/> కార్యక్రమంలో డిసిసిబి సిఇఓ à°¡à°¿.సత్యనారాయణ, జిఎం కిరణ్మయి., అంధవరపు సూరిబాబు, సురంగి మోహన రావు, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam