DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్ కౌంటర్ ఉదయం గం. 5:30 తర్వాతే జరిగింది 

దిశ కుటుంబ సమాచారం బయట పెట్టవద్దు. మీడియా కు సూచన 

పంచనామా, ప్రెస్ మీట్ అన్ని ప్రక్రియలో ఘటనా స్థలిలోనే. . .

ఇద్దరు పోలీసు సిబ్బంది కి తీవ్ర

గాయాలయ్యాయి. . .

ప్రెస్ మీట్ లో సైబరాబాద్ కమిషనర్ వి సి సజ్జన్నార్.

DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . . 

అమరావతి, డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌) :

దిశ ఘటన లో దోషుల ఎన్ కౌంటర్ జరిగిన సందర్భానికి à°—à°² కారణాలను  à°¸à±ˆà°¬à°°à°¾à°¬à°¾à°¦à± కమిషనర్ వీ సి సజ్జనార్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం ఘటనా స్థలి వద్దే

ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రక్రియలో వివరాలను తెలియచేసారు. ఎక్కడైతే ఘటన జరిగిందో అదే ఘటనా స్థలిలోనే నేరస్థులను ఎన్ కౌంటర్ జరగడం, అనంతరం పంచనామా,

తదుపరి వివరాలు తెలియచేసే విలేకరుల సమావేశం కూడా అక్కడే నిర్వహించడం పట్ల పోలీసు అధికారులు సైతం ఎంతగా బాధపడ్డారో తెలుస్తోంది. 
వివరాలను తెలియచేస్తూ

సజ్జనార్ మాట్లాడుతూ చర్ల పల్లి జైలు నుంచి పోలీస్ కస్టడీ లోకి తీసుకు వచ్చి ఘటన స్థలిలో విచారణకు, ఆధారాలు సేకరించేందుకు దిశ మొబైల్, ఇతర సామాగ్రి

సేకరించేందుకు నేరస్థులు నలుగురిని చటాన్ పల్లి గ్రామానికి తీసుకు వచ్చినట్టు తెలిపారు. అక్కడే దిశ ఫోన్ దాచమని చెప్పడంతో ఘటన స్థలికి 10 మందితో కూడిన పోలీసు

బృందాలు వీళ్ళతో పాటు చేరుకున్నారు. అయితే నలుగురిలో ఇద్దరు తప్పు దారి పట్టించేల యత్నించడంతో పాటు, పోలీసుల నుంచి రెండు తుపాకులు లాక్కుని  à°ªà±‹à°²à±€à°¸à±à°²à°ªà±ˆ ఎదురు

తిరగడంతో పోలీసులు వారించే ప్రయత్నం చేశారన్నారు. దాంతో రాళ్లు విసరడంతో à°’à°• ఎస్ ఐ వెంకటేశ్వర్లు , à°’à°• కానిస్టేబుల్ అరవింద్ లకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.   ఆరిఫ్ ,

చెన్నకేశవులు వద్ద పోలీసులు తుపాకులు స్వాధీనం చేసున్నట్టు తెలిపారు. దీంతో గురువారం ఉదయం à°—à°‚. 5 :30  à°¨à±à°‚à°šà°¿ à°—à°‚. 06 :15 మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని తెలిపారు. అనంతరం అదే స్థలం

వద్ద పంచనామా కూడా జరపడం జరిగిందన్నారు. అదే ప్రాంతంలో విలేకరుల సమావేశం జరగడం గమనార్హం. 

దిశ కుటుంబ వివరాలు చెప్పొద్దు :

ఈ ఘటన అనంతరం బాధిత దిశ

కుటుంబం గురించిన వివరాలు, వారి స్పందన తదితర అంశాలను బయట పెట్టవద్దని మీడియా వర్గాలకు సూచించారు. ఇప్పడికే ఎంతో వేదన పడుతున్న వారిని ఈ మీడియా స్పందనలతో మరింత

వేదన కు గురిచేయడం తో పాటు, వారి వివరాలు బయటకు తెలియచేయడం మంచిది కాదన్నారు. ఏ కేసులోనైనా విచారణాధికారులు నుంచి సమాచారం తీసుకోకుండా నోటికి వచ్చిన వ్యాఖ్యలు

చెయ్యడం ద్వారా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్నారు. నేరాలకు సంబంధించిన కధనాలు ప్రకటించే ముందు సంబంధిత పోలీసు అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవాలని

మీడియా కు హితవు పలికారు. 

ఈ కేసు విచారణలో సహకరించిన ప్రజలకు, మీడియా వర్గాలకు, ఆయన ధన్యవాదములు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam