DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉత్సవ్ తో విశాఖ ను ప్రపంచ పర్యాటక రాజధానిగా మారుస్తాం

à°ˆ నెల 28, 29 తేదీల్లో వైభవంగా విశాఖ ఉత్సవ్  

విశాఖ ను పర్యాటక రాజధానిగా మారుస్తాం  

విశాఖ ఉత్సవ్ తో వేడుకలతో విశాఖ చరిత్ర మారిపోతుంది

సమీక్ష లో

 à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక శాఖామంత్రి అవంతి . . . .

(DNS రిపోర్ట్ : రాం CVS , Bureau, విశాఖపట్నం): . . . 

విశాఖపట్నం, డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 28 ,29 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించే

విశాఖ ఉత్సవ్ ను ప్రపంచ పర్యాటక స్థాయి లో నిర్వహించి, విశాఖ నగరాన్ని 
ప్రపంచ  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• రాజధానిగా మారుస్తామని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి

శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన సమీక్ష సమావేశం లో తెలిపారు. సమీక్ష అనంతరం ఆయన మీడియా తో  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ విశాఖ

ఉత్సవాలను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా, ప్రపంచ పటంలో విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. 
ఈ ఉత్సవాలను పండగ వాతావరణంగా

నిర్వహిస్తున్నామని, నగర పరిధిలోని వాణిజ్య వ్యాపార వర్గాలు, కల సంస్కృతిక రంగాలు, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, స్వచ్చంద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో

సహకరించాలని కోరారు. 

విశాఖ సాగర తీరం లోని రామకృష్ణ బీచ్ వద్ద గల భవతారిణి కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసే ప్రధాన వేదిక, నోవొటెల్ హోటల్ ఎదురుగా ప్రాంతంలో

జాతర వేదిక, వైఎస్సార్ సెంట్రల్ పార్క్ ( ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా)  à°²à±‹ పుష్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకునేలా సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. 
/>  à°°à±†à°‚డురోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే à°ˆ వేడుకల్లో ప్రముఖ కళాకారులూ, కవులు, సాహితీ వేత్తలను ఘనంగా సత్కరించనున్నట్టు తెలిపారు. ప్రజలకు ఈకువ మందికి à°ˆ

వేడుకల సమాచారం తెలిసే విధంగా ప్రసార మాధ్యమాలు, టీవీలు, పత్రికలూ, కేబుల్ టీవీలు, వెబ్ మాధ్యమాలు, ఎఫ్ ఎం రేడియో లో, సోషల్ మీడియా లో, సినిమా థియేటర్ లలోనే విస్తృత

ప్రచారం కల్పించాలన్నారు. ప్రధాన కూడళ్లలో భారీ హోర్డింగ్ లు, భారీ బెలూన్ లు, ఆర్టీసీ బస్సులపై బానర్లు, తదితర ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి

కళా వేదికల కు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్టు వివరించారు. 
మొదటి రోజు ఆర్కే బీచ్ లో అతిపెద్ద కార్నివాల్ నిర్వహిస్తామని, సంస్కృతి

సంప్రదాయాలను తెలిపేలా జానపద, గిరిజన కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయన్నారు. దీనికి అదనంగా భారీ తినిబండారాల కూడళ్లు, వాణిజ్య వ్యాపారాల స్టాళ్లు ఉంటాయన్నారు.

బీచ్ రోడ్ లో సైకత శిల్పాలు ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. 

ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర పర్యాటక శాఖా మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్

వినయ్ చాంద్, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన, సంయుక్త కలెక్టర్ శివశంకర్, విశాఖ ఎంపీ ఎం వివి సత్యనారాయణ, శాసన సభ్యులు కరణం

ధర్మశ్రీ, ఆదిప్ రాజ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam