DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదానం చేసి రక్తదాన కేంద్రం ప్రారంభించిన ఎంపీ  ఎంవివి

రక్తదానం చెయ్యండి - నాలుగు ప్రాణాలు కాపాడండి 

కెజిహెచ్ లో రక్తదాన కేంద్రం ప్రారంభంలో ఎంవివి పిలుపు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, డిసెంబ‌రు 07, 2019 (డిఎన్‌ఎస్‌): రక్తదానం చెయ్యడం ద్వారా మరో నాలుగు ప్రాణాలు కాపాడవచ్చని, విశాఖపట్నం లోక్ సభ సభ్యులు à°Žà°‚ వివి సత్యనారాయణ

పిలుపునిచ్చారు. శనివారం ఉత్తరాంధ్ర పెద్ద ఆసుపత్రిగా పేరు పొందిన కింగ్ జార్జి ఆసుపత్రిలో ఆయన స్వయంగా రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్బంగా

ఆయన మాట్లాడుతూ అపోహలు, భయాలు వీడి ప్రతిఒక్కరూ రక్త దానం చేయాలని పిలుపు నిచ్చారు. శనివారం కేజీహెచ్ లోని కూలర్ బ్లడ్ బ్యాంకు ను ఆయన 
స్వయంగా రక్తదానం చేసి

ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  à°°à°•à±à°¤ దానం చేయడం వలన మరొ నాలుగు ప్రాణాలను నిలిపిన వారవుతామన్నారు. ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి మరో నలుగురితో రక్త దానం

చేయించాలని పిలుపునిచ్చారు. దేశం లో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ,ఆ క్షతగాత్రులకు సరిపడా రక్తపు నిల్వల అవసరం ప్రతి ఏటా

పెరుగుతున్నాయన్నారు. కాబట్టి స్వచ్చంద రక్తదానం పట్ల అంకితభావం అవసరమన్నారు. తానూ ఓ ప్రజాప్రతినిధిగా సభలు సమావేశాల్లో ఇదే విషయాన్ని చెబుతానని, అదే విషయాన్ని

ఆచరిస్తానని స్పష్టం చేశారు. à°ˆ కార్యక్రమంలో కేజీహెచ్  à°¸à±‚పరింటెండెంట్ అర్జున తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam