DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కిలో రూ.25కు అమ్మకం, దేశంలోనే రికార్డు: సీఎంజగన్ 

దేశం మొత్తంలో ఉల్లి ని తక్కువ ధరకు ఇస్తోంది మేమే – 

హెరిటేజ్ ధర :కిలో రూ. 200, రైతుబజార్ లో:రూ. 25 కే. 

అసెంబ్లీ లో అదిరిపోయిన ఉల్లి కథా కమామిషు 

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .. . 

అమరావతి, డిసెంబ‌రు 09, 2019 (డిఎన్‌ఎస్‌) : దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉల్లి ధరను తక్కువ ధరకు అందిస్తున్నది ఒక్క

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ స్పష్టం చేశారు. టిడిపి, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై జగన్ తనదైన రీతిలో స్పందించారు. మన

రాష్ట్రంలో ఉల్లిలేకపోతే.. పక్క రాష్ట్రాలనుంచి కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ.. అసెంబ్లీలో సీఎం వైయస్‌.జగన్ వివరణ

ఇచ్చారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేం కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. దేశం మొత్తమ్మీద ఒక్క ఏపీ లో మాత్రమే రూ.25 లకు ఉల్లి పాయలు అమ్ముతోందని జగన్

తెలిపారు. ప్రతి రైతు బజార్‌లోనూ కేజీ 25 లకే అమ్ముతున్నామని సీఎం పేర్కొన్ననారు. ఇంతవరకూ 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ రూ.25లకు అమ్ముతున్నట్లు

వెల్లడించారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని షోలాపూర్, ఆల్వార్‌ లాంటి చోట్లనుంచి కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎక్కడ దొరికినా ఉల్లిని కొనుగోలు

చేస్తున్నామన్నారు. ఇదే చంద్రబాబుగారి హయాంలో అయితే.. ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు లేక.. పొలాల్లోనే ఉల్లిపాయలు వదిలేసిన పరిస్థితులు చూశామన్నారు. ఇవాళ రైతులకూ

మంచిరేటు లభిస్తోంది. మరోవైపు వినియోగదారులకు నష్టం రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.25 కు అమ్ముతున్నామని సీఎం వివరించారు. చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో

కేజీ ఉల్లి రూ.200లకు అమ్ముతు న్నారని జగన్ విమర్శించారు. వీళ్లు ఇక్కడకు వచ్చి… పేపర్లు పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారన్నారు. వీళ్లు చేసే పనులకు న్యాయం,

ధర్మం అనేది ఎక్కడైనా ఉందా అని సీఎం ప్రశ్నించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam