DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజీ లో ఎన్  సిసి కి 50 ఏళ్ళు 

ఏపీలో ఎన్ సిసి ఉన్న మొదటి మహిళా కాలేజీ ఇదే. .

14 à°¨ వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలు : ప్రిన్సిపాల్ పద్మావతి.  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

.

అమరావతి, డిసెంబ‌రు 10, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కాలేజీ లో  à°¨à±‡à°·à°¨à°²à± క్యాడెట్ కార్ప్ స్ (ఎన్ సిసి )

ప్రారంభించిన 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఈ నెల 14 న స్వర్ణోత్సవ వేడుకలు జరుపుతున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. పద్మావతి తెలిపారు. మంగళవారం

కళాశాల ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ కళాశాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని, నవయుగ వైతాళికుని ఆదర్శాలకు నిదర్శనంగా

ప్రారంభించిన కళాశాల ఇది, ఇక్కడ ఆధునిక, సామాజిక, రాజకీయ, సంస్కృతిక విలువలతో కూడిన విద్యావిధానాన్ని విద్యార్థినులకు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కళాశాల

స్వర్ణోత్సవ వేడుకలకు ఎన్ సిసి డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఎయిర్ కమోడ్ ఎన్ ఎన్ రెడ్డి, ఎన్ సిసి కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ శ్రీనివాస్, గర్ల్స్ బెటాలియన్ ఆఫీసర్

లెఫ్టనెంట్ కల్నల్ ఏ ఎస్ రానా అతిధులుగా  à°¹à°¾à°œà°°à°µà±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± తెలిపారు.  
కళాశాల ఎన్ సిసి అధికారి మేజర్ డాక్టర్ బి. కళ్యాణి మాట్లాడుతూ గడిచిన 50 ఏళ్లుగా నిరంతరాయంగా

నిబద్దతతో కళాశాలలో ఎన్ సిసి నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా ఎన్ సిసి నిర్వహించబడుతున్న ఏకైక మహిళా కళాశాల తమ ఒక్కటేనని తెలియచేసారు. 1969 లో

ఆవిర్భావం నాటి నుంచి కేర్ టేకర్ గా టి. వేదవతి, ఏ పి ఎస్ మంగాదేవి లు వ్యవహరించారని, తదుపరి పాలిటిక్స్ అధ్యాపకురాలు మేజర్ డాక్టర్ చల్ల సత్యవాణి నడిపించారని

వివరించారు. ఆమె సుమారు 25 ఏళ్ళ కాలం దిగ్విజయంగా నిర్వహించారన్నారు. ప్రస్తుతం 100 మంది ఎన్ సిసి సభ్యులు ఉన్నారని, వీరిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ లోనూ

పాల్గొన్నారని, వివిధ సందర్భాల్లో ఎన్నో సాహసకృత్యాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత హోదాల్లో ప్రస్తుతం ఈ కళాశాల ఎన్ సిసి క్యాడెట్ లు

ఉన్నారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam