DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో దిశ యాక్ట్‌ : అత్యాచారం చేస్తే ఉరిశిక్షే

21  à°°à±‹à°œà±à°²à±à°²à±‹à°—à°¾ దోషులకు శిక్ష అమలుకు సై

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 11, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°®à°¹à°¿à°³à°² భద్రతకు సబంధించి ఏపీ

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడి కేసులో

నిందితులకు మరణశిక్ష పడేలా దిశ యాక్ట్‌ పేరిట కొత్త చట్టానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మహిళా భద్రత విషయంలో కఠినచట్టం తీసుకొస్తామని సీఎం జగన్‌ ఇప్పటికే

శాసనసభలో ప్రకటించారు. మహిళలపై లైంగిక దాడి కేసుల్లో నిర్దిష్టమైన ఆధారాలుంటే నిందితులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా రూపొందించిన డ్రాఫ్ట్‌ బిల్లుకు మంత్రి

వర్గం ఆమోదముద్రవేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే నేర శిక్షాస్మృతి సెక్షన్‌ 354(ఎఫ్‌)

కింద చర్యలు తీసుకునేలా బిల్లులో పొందుపర్చినట్టు సమాచారం. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం

నిర్ణయించింది.
* కాపు ఉద్యమం సందర్భంగా పెట్టిన అన్ని కేసులు ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. తుని ఘటన సహా అన్ని కేసులు రద్దు చేయాలని, తుని ఘటనలో

పెట్టిన కేసుల రద్దు కోసం కేంద్రానికి సిఫారసు చేయాలని నిర్ణయం.

* ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ కేబినెట్‌ నిర్ణయం.

* రూ.3వేల

కోట్ల రుణం తీసుకునేందుకు పౌరసరఫరాలశాఖకు అనుమతి.

* భోగాపురం విమానాశ్రయం భూసేకరణ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం.

* ప్రజా రవాణా వ్యవస్థ

ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే చట్టసవరణకు ఆమోదం తెలిపింది.

* రాజధాని భూముల్లో థర్డ్‌ పార్టీకి

ఇచ్చిన భూములకు ప్లాట్ల కేటాయింపులు రద్దు చేసి, à°† ప్లాట్లను తిరిగి అసైన్డ్‌ భూముల యజమానులకు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam