DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎపి టిడ్కో రివర్స్ టెండరింగ్ లో మరో రూ. 46 కోట్ల ఆదా

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 13, 2019 (డిఎన్‌ఎస్‌) : ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్

రెడ్డి ఆలోచనల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో సత్ఫలితాలు వస్తున్నాయని, ఈ విధానం ద్వారా ప్రజా ధనం దుర్వినియోగం

కాకుండా నియంత్రించగలుగుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 
    à°ªà±à°°à°œà°¾ ధనాన్ని ఆదా చేసే క్రమంలో చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంలో భాగంగా పట్టణ

ప్రాంతాల్లో గృహనిర్మాణాలకు సంబంధించి ఎపి టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో శుక్రవారం నాడు మరో రూ.46.03 కోట్ల మేర ఆదా అయ్యిందని పురపాలక శాఖ

మంత్రి బొత్స సత్యనారాయణ  à°µà±†à°²à±à°²à°¡à°¿à°‚చారు. à°ˆ ప్రక్రియలో భాగంగా à°—à°¤ నెలలో నిర్వహించిన తొలివిడత రివర్స్ టెండరింగ్ లో సుమారు రూ. 106 కోట్లు ఆదా అయిన విషయం తెలిసిందే.

రెండో విడతలో భాగంగా శుక్రవారం నాడు అనంతపురం , పశ్చిమ గోదావరి జిల్లాలోని 6496 ఇళ్లకు నిర్మాణానికి  à°¸à°‚బంధించిన  à°Ÿà±†à°‚డర్లలో  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°•à°¿ రూ.46 కోట్ల మేర ఆదా

అయ్యింది.  à°ˆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి రూ.317. 45 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ చేపట్టగా, అందులో రూ. 271.42 కోట్లతో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు

బిడ్లు దాఖలు చేశారు. ఈ బిడ్ల ద్వారా అంచనా వ్యయం కంటే 14.5 శాతం తక్కువ ధరకే పనులు చేపట్టడం ద్వారా, ఆమేరకు ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గింది.
    à°…ంతపురం జిల్లాలో

(ఫేజ్ 2) లో భాగంగా రూ.220.69 కోట్ల అంచనాతో 4608 ఇళ్ల నిర్మాణ పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ఎన్ జెఆర్ కన్ స్ట్రక్షన్స్ సంస్థ రూ.188.69 కోట్లకు బిడ్డు దాఖలు

చేసి ఎల్ 1 గా నిలిచింది. ఇదే ప్రాజెక్టు గత ప్రభుత్వం చదరపు అడుగు నిర్మాణానికి రూ.1596 కు కాంట్రాక్టు ఖరారు చేయగా , తాజా ప్రక్రియలో రూ.14.5 శాతం తక్కువ ధరతో చదరపు

అడుగుకు రూ. 1365 కే నిర్మాణం జరుగుతుంది.
అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.96.76 కోట్ల అంచనా వ్యయంతో 1888 ఇళ్లకు సంబంధించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో శ్రద్ద

శబూరి ప్రాజెక్టు సంస్థ రూ.82.73 కోట్ల కు బిడ్ దాఖలు చేసి ఎల్1 గా నిలిచింది. ఈ ప్రాజెక్టులో కూడా 14.5 శాతం తక్కువ ఖర్చుతో పనులు చేపట్టడానికి మార్గం సుగమమైంది. ఈ

ప్రాజెక్టులో నిర్మాణ వ్యయం గతంలో చదరపు అడుగుకు రూ.1602 కు ఖరారు కాగా, ఇప్పుడు అది రూ.1370 కు తగ్గి ఆ మేరకు ప్రభుత్వానికి ఆదా అయ్యింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam