DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వేజోన్‌ ఏర్పాటు పై భాజపా సమాధానం చెప్పాల్సిందే : సిపియం 

విశాఖపట్నం, జూన్‌  19, 2018 (డిఎన్‌ఎస్‌) : విశాఖ వాసులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం ఆరు కోట్ల ఆంధ్రా ప్రజలను

మోసగించడం పై భారతీయ జనతా పార్టీ ఆంధ్రా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాధం డిమాండ్‌ చేసారు. మంగళవారం నగరంలోని సీపీఎం

జిల్లా కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ à°ˆ రైల్వే జోన్‌ కోసం ఉత్తరాంధ్ర ప్రజు దశాబ్దాల కాలం  à°Žà°¦à±à°°à± చూస్తున్నారని, దీనికై ఎన్నో

ఉద్యమాలు  à°¸à±ˆà°¤à°‚ చేసారన్నారు. నాలుగురోజు క్రితం విశాఖ ఎంపీ హరిబాబు రైల్వేజోన్‌ పై రాజకీయ నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు. అయితే దానికి విరుద్ధంగా కేంద్ర

రైల్వే శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢల్లీిలో సోమవారం రాష్ట్ర విభజన చట్టంలోని ఎపికి కొత్త రైల్వేజోన్‌ అంశం పరిశీలించాలనే వుందని, ఇవ్వాని ఎక్కడా లేదని

చెప్పడాన్ని సీపీఎం ఖండిస్తోందన్నారు. నిన్నమొన్నటి వరకు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన బిజెపి  à°¨à±‡à°¡à± రైల్వేజోన్‌ అంశం

పరిశీలనే తప్ప ఇవ్వాలని లేదనడం దుర్మార్గమన్నారు. బిజెపి నేతలు  à°’క్కరికొకరు పొంతనలేకుండా మాట్లాడడం పట్ల విశాఖ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం

చేస్తున్నారని మండిపడ్డారు.
    à°°à°¾à°·à±à°Ÿà±à°° విభజన చట్టంలో 6 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాని పేర్కొన్నారని, బిజెపి, తెలుగుదేశం విశాఖ

కేంద్రంగా రైల్వేజోన్‌ ఇస్తామని పదేపదే ప్రకటించారు. విశాఖ బిజెపి ఎంపి కంభంపాటి హరిబాబు, తెలుగుదేశం ఎమ్మెల్యే, నాయకులు మేము ఎలాగైనా తీసుకొస్తామన్న వారు

నేడు ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన బిజెపి, టిడిపి అభ్యర్ధిని గెలిపిస్తే విశాఖ కేంద్రంగా జోన్‌ వచ్చి

తీరుతుందని చెప్పి మరీ ఓట్లు వేయించుకున్నారని, కేంద్రంలో అధికారంలో వున్నది బిజెపి ప్రభుత్వమని,  à°¬à°¿à°œà±†à°ªà°¿à°•à°¿ చెందిన విశాఖ ఎంపి, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎందుకు

రైల్వేజోన్‌ తేలేకపోయారో విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజ మనోభావాలను దెబ్బతీసిన బిజెపి, టిడిపి ప్రభుత్వాలకు పోరాటాల ద్వారా తగిన

బుద్ధిచెప్పాలని,  à°†à°‚ధ్ర రాష్ట్ర ప్రజ ఆందోళలను అర్ధం చేసుకోకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని, ఎపికి న్యాయం చేస్తామని ప్రగల్భాలు  à°ªà°²à°¿à°•à°¿ నేడు

నిలువునా మోసం చేసిన బిజెపి, టిడిపిలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
    à°µà°¿à°¶à°¾à°– కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుచేయాలని ఉత్తరాంధ్ర ప్రజానీకం పోరాటం

చేస్తున్నప్పటికీ రైల్వేజోన్‌  à°…ంశం పరిశీలించానే వుందని, ఇవ్వాలని ఎక్కడా లేదని చెప్పడం అత్యంత దుర్మార్గంగా అభివర్ణించారు. దీనికి ఆంధ్ర ప్రదేశ్‌ బిజెపీ

భాద్యత వహించాలని డిమండ్‌ చేసారు. దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌ కేంద్రంగా à°— తూర్పు కోస్తా

రైల్వేలో కలపడం వలన ఉత్తరాంధ్ర ప్రజానీకం తీవ్రమైన అన్యాయానికి గురౌతున్నారని, ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌

ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వేజోన్‌ ఇవ్వాని విభజన చట్టంలో ఉన్నప్పటికీ బిజెపి ప్రభుత్వం రోజుకోమాట, పూటకోమాట

మాట్లాడడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకోకుండా విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి.

లేకపోతే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam