DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్వారీ గోతుల అంశంపై గవర్నర్‌కు రాజమండ్రి వాసుల ఫిర్యాదు

-సానుకూలంగా స్పందించారని కొండబాబు వెల్లడి 


(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 18, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా

 à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం, లో ఎందరో పేదల ప్రాణాలను బలితీసుకుంటున్న క్వారీ గోతుల అంశాన్ని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి రాజమహేంద్రవరం నగర పాలక

సంస్థ స్థాయీ సంఘం మాజీ ఛైర్మన్‌ బర్రే కొండబాబు తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి à°ˆ మేరకు ఆంగ్లంలో à°“ వినతిపత్రాన్ని అందించారు. à°ˆ

సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో క్వారీ గోతుల వల్ల జరిగిన ప్రమాదాలు, క్వారీ గోతులను పూడ్చాలని 2011 సంవత్సరం నుంచి చేస్తున్న ప్రజాపోరాటాలతోపాటు,

న్యాయపోరాటాలకు సంబంధించిన అంశాలను గరవ్నర్‌కు బర్రే కొండబాబు వివరించారు. తక్షణమే క్వారీ గోతులను పూడ్చాలని హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న క్వారీ

యజమానులు, సంబంధిత అధికారుల నిర్వాకాన్ని ఆయనకు వివరించారు. క్వారీల్లో కంకరు రాయిని తవ్వుకుని కోట్లు సంపాదించుకున్న ప్రైవేటు క్వారీ యజమానులు తిరిగి క్వారీ

గోతులను పూడ్చకుండా క్వారీ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని గవర్నర్‌కు వివరించారు. క్యారీ యజమానుల నిరక్ష్య వైఖరికి వ్యతిరేకంగా తాను 2011

సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. రామదాసుపేట, సింహాచల నగర్‌, సుబ్బారావు నగర్‌ పరిధిలోకి వచ్చే లీడిడ్‌ ఆర్‌ఎస్‌ నెంబర్‌ 57/4, 58/3, 4, 144, 147/ఐసి, 163, 164, 166, 167/ఐ మరియు 2

మరియు 168 లీడీలకు 2011 అక్టోబర్‌ 21à°¨ హైకోర్టు నోటీసు ఇచ్చిందన్నారు. రక్షణ కంచె, క్యారీ గోతులను పూడ్చకుండా వదిలివేసిన క్యారీ సలాలను ఫారం-3 నియమ నిబంధనలను పాటించాలని

రాజమండ్రి గనులు, భూగర్భ శాఖ సహాయక శాఖాధికారికి హైకోర్టు సిఫార్సులు ఇచ్చిందని వివరించారు. అయితే హైకోరు సిఫార్సులను పట్టించుకోకపోవడంతో మరోసారి హైకోర్టును

ఆశ్రయించినట్లు వెల్లడించారు. దీనిపై 2012 నవంబర్‌ 30à°µ తేదీన మరోసారి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. తమ ఆదేశాల ప్రకారం రెండు నెలల లోపు లీజుదారులు క్వారీ

గోతులను పూడ్చకపోతే ఇతర లీజులను రద్దు చేయాలని, దానికి కట్టుబడి సంబంధిత లీజుదారులు ఉండకపోతే సంబంధిత వ్యక్తుల ఏజెన్సీలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని,

కొత్తగా లీజులను విడుదల చేయకుండా నిషేధించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వివరించారు. అప్పటికే రెండు దఫాలు హైకోర్టు చేసిన సిఫార్సులను సంబంధిత క్వారీ

యజమానులు పట్టించుకోకపోవడంతో 2013 మార్చి 23à°µ తేదీన మరోసారి రాజమండ్రి గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. సంబంధిత క్వారీ ప్రాంతంలో

నివాసముంటున్న ప్రజలకు, ఆ ప్రాంతాలను ప్రమాదకరంగా మార్చిన 50 మంది బాధ్యులైన లీజదారులు, యజమానులపై నేరపూరిత కేసులను నమోదు చేయాలని రాజమండ్రి మూడో పట్టణ పోలీసు

హౌస్‌ఆఫీసర్కు సిఫార్స్‌ చేసిందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన సిఫార్సులను à°¦ ష్టిలో పెట్టుకుని భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌ పెట్టిన త్రీటౌన్‌ పోలీస్‌

స్టేషన్లో కేసు పెట్టారని, అయితే ఆ కేసులో హైకోర్టు సూచించిన విధంగా కాకుండా కేసు పెట్టి సంబంధిత శాఖ అధికారి చేతులు దులుపుకున్నారని వివరించారు. దీనిపై

గరవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, తక్షణమే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారని బర్రే కొండబాబు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిలను కలిసి క్వారీ గోతుల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తానని కొండబాబు వెల్లడించారు. గవర్నర్‌ను కలిసిన

వారిలో బూసి సత్యనారాయణ, ఐనంపూడి లలితా ప్రసాద్‌, దళిత నాయకుడు రవిబాబు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam