DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబుపై కోపంతో అమరావతిని మార్పు యత్నం: ఎంపీ రామ్మోహన్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 18, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¸à°¿à°‚గపూర్‌ను ఆదర్శంగా తీసుకుని రాజధానిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు

ప్రయత్నించారని... బాబుపై కోపంతో ఇప్పుడు అమరావతిని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ప్రకటనపై ఆయన

స్పందిస్తూ ఏపీ రాజధానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిని చేస్తామని ఇప్పటికైనా ప్రకటన చేస్తారా? అని నిలదీశారు. ఏపీ

రాజధానిపై ఇప్పటికే స్పష్టత లేకుండా ఉంటే... మూడు రాజధానులంటూ నిన్న అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారని ఎంపీ విమర్శించారు. ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్నినాశనం

చేస్తారని బాధగా ఉందని అన్నారు.

గత 6 నెలల్లో 22 మంది వైసీపీ ఎంపీలు రాష్ర్ట అభివృద్ధి కోసం ఏం పోరాటం చేశారని నిలదీశారు. ఎన్నికల్లో పలు హామీలిచ్చి ఇంత వరకు

ఏమీ సాధించకపోవడం వైసీపీ ఎంపీల వైఫల్యమన్నారు. ముగ్గురు ఎంపీలు ఉన్న టీడీపీ తరుపున రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి నిరంతరం పోరాటం

చేస్తూన్నామని ఎంపీ స్పష్టం చేశారు. సీఎంకు కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు మీద కోపాన్ని అమరావతి,

పోలవరం మీద చూపిస్తూన్నారని ఆరోపించారు. అసెంబ్లీ చూస్తే ప్రజలు అస్యహించుకుంటున్నారని, మంత్రులు అసభ్య పదజాలంతో మాట్లాడటం సబబు కాదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు

అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam