DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విధి నిర్వహణలో బాలల హక్కులు పరిరక్షించాలి- జడ్జి కిషోర్ కుమార్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 19, 2019 (డిఎన్‌ఎస్‌) : సేవాధికార సంస్థ మరియు వరల్డ్ విజన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నాడు జిల్లా

కోర్టు ఆవరణలో ని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవాసదన్ భవనము నందు తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లలోని ఎస్ ఐ హోదా లోని

జువెనైల్ చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ అధికారులకు, మెంబర్లకు, ప్రత్యేక జువెనైల్ పోలీస్ యూనిట్ వారికి వారివారి విధులలో బాలల హక్కులు-చట్టాలు అనే అంశాలపై అవగాహన

నైపుణ్యం పెంపొందించే దిశగా ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. à°ˆ కార్యక్రమాన్ని జిల్లా మొదటి అదనపు జడ్జి, à°¡à°¿ ఎల్ ఎస్ ఏ ఏ  à°šà±ˆà°°à±à°®à°¨à± మరియు ప్రిన్సిపల్

జిల్లా జడ్జి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిహెచ్ కిషోర్ కుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ అధికారులను

ఉద్దేశించి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని బాలల హక్కులు, చట్టాలను అమలు

పరచాలని తద్వారా సమాజంలో బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ

శ్రీమతి కె వి ఎల్ హిమబిందు మాట్లాడుతూ సంవత్సరమునకు రెండు పర్యాయములు జూన్ మరియు డిసెంబర్ మాసంలో జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ పోలీ స్ అధికారులు తమ విధులను

కాలానుగుణంగా అప్ డేట్ చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. à°ˆ శిక్షణ కార్యక్రమంలో ఆయా యా క్టులు  à°ªà±ˆ గౌరవ అమలాపురం రెండో అదనపు జిల్లాజడ్జి సి

ఎన్  à°®à±‚ర్తి, జువనైల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ à°¡à°¿ శ్రీదేవి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ  à°šà±ˆà°°à± పర్సన్ శ్రీమతి జి పద్మావతి సీనియర్ న్యాయవాది

దుర్గాప్రసాద్ ప్రసంగిస్తూ అవగాహన కల్పించారు. వరల్డ్ విజన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అరు ల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam