DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి  ప్రభుత్వాసుపత్రి లో నిత్యాన్నదానం ప్రారంభం

ఇస్కాన్ అధ్యక్షులు సత్యగోపినాధ్ దాస్ ట్రస్ట్ నిర్వహణలో 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 19, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°ªà°°à°µà°¸à±à°¤à±

సత్యగోపినాధ్ దాస్ సేవా ట్రస్ట్ సేవా కార్యక్రమాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని గురువారం

మధ్యాహ్నం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సోమ సుందరం, ఆర్ ఎం ఓ డాక్టర్ లక్ష్మీపతి ల చేతులమీదుగా ప్రారంభించారు. 200మందికి భోజన పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం ద్వారా

ప్రతి రోజు మధ్యాహ్న ఉచిత భోజన పంపిణీ చేస్తామని ముఖ్య అతిధి గా పాల్గొన్న ట్రస్ట్ చైర్మన్ సత్యగోపినాధ్ దాస్ వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు విద్య

,నిరాశ్రయులకు దుప్పట్లు, వస్త్రాలు ,వృద్దులకు వైద్యం, చిన్నపిల్లలకు పౌష్టికాహారం ,యువతి యువకులకు వృత్తినైపుణ్య శిక్షణలు తదితర కార్యక్రమాలు చేపడతామని

తెలిపారు. సేవ చేయటం ద్వారానే ప్రజలలో నైతిక ధైర్యాన్ని నింపగలమని ఆయన చెప్పారు. భగవంతుడు కల్పించిన అవకాశాలతో ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని

సత్యగోపినాధ్ దాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ మాజీ మెంబర్ కందికొండ రమేష్, రాజమండ్రి రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు,యానాపుఏసు

,గోపిశ్రీనివాస్ రొంగల, బలరామనాయుడు, వీరబాబు, మహమ్మద్ రఫీ, రామారావు, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam