DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకం, ఎమ్మెల్సీ మాధవ్

హైకోర్టు కర్నూలు లో పెట్టాలనేది డిమాండ్ బీజేపీ దే.. . 

మూడు రాజధానుల కు వ్యతిరేకం, కౌన్సిల్ వ్యతిరేకించింది 
 
రైతులు రోడ్డెక్కడం మంచిది కాదు :

ఎమ్మెల్సీ మాధవ్  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . 

విశాఖపట్నం, డిసెంబ‌రు 19, 2019 (డిఎన్‌ఎస్‌): ఏపి రాజధాని వికేంద్రీకరణ తగదని బిజెపి మొదటినుంచీ

చెపుతోందని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. గురువారం నగర బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు ను

కర్నూల్ లోనే పెట్టాలని తాము ముందు నుంచే డిమాండ్ చేస్తున్నామన్నారు. అయితే   విభజన చట్ట ప్రకారం వచ్చే సంస్థలను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసి సమన్యాయం జరపాలని

కోరామని, అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం à°ˆ అంశం పై à°—à°¤ ఐదు నెలలుగా స్పష్టత ఇవ్వలేదని, రాజధాని అమరావతి మీద దోబూచులాడింది. 

ప్రస్తుతం ఏపీ శాసన సభ

శీతాకాల సమావేశాల్లో ఆఖరి రోజున చివరి నిమిషంలో ఎటువంటి స్పష్టత లేకుండా ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మూడు రాజధానులు

ఉంటాయంటూ చేసిన ప్రకటనపై శాసన మండలిలో ముక్త కంఠం తో విభేదించామన్నారు. పారిశ్రామికంగా ఎదుగుతున్న విశాఖ నగరం లో పరిపాలనా రాజధాని ఏ మేరకు ఉంటుందో స్పష్టత

ఇవ్వలేదన్నారు. కమిటీ నిర్ణయం చెప్పకుండానే నేరుగా ముఖ్యమంత్రే రిపోర్ట్ ను చదవడం చూస్తే వీళ్ళకి కావాల్సినట్టుగానే కమిటీ నివేదిక ఇస్తుందని తేలిందన్నారు.

 

అసెంబ్లీ ఉన్నచోటే సెక్రటేరియట్ ఉంటే బాగుంటుందని బిజెపి భావిస్తోంది. స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి. జిఎన్ రావు ఆద్వర్యంలోని నిపుణుల కమిటీ

నివేదిక రాకుండా జగన్ శాసన సభలో అస్పష్డ ప్రకటన ఎందుకు చేశారు? చర్చకోసమా?
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వారికి వివరంగా చెప్పాల్సిన

బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. విశాఖను రాజధానిగా తయారు చేస్తే. . ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 
 
ఒక్క రాజధాని స్థానంలో మూడు ప్రాంతాలు

విస్తరిస్తున్నప్పుడు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ధర్నా చేయకూడదన్నారు.  à°°à±ˆà°¤à±à°²à± రోడ్డెక్కి నిరసనలు చేస్తే రాష్ట్ర పరువు రోడ్డెక్కుతుందన్నారు.

 à°…మరావతి లో శాసన సభ, శాసన మండలి ఉండగా, ఆందోళనలకు ఆస్కారం లేదన్నారు. 

à°ˆ సమావేశంలో బీజేపీ విశాఖ నగర అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam