DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల లో ప్రతి ఒక్కరూ వైష్ణవ దీక్షలో ఉండాల్సిందే.: చిన్న జీయర్ 

ఇతర ఆలయాల్లోనూ  à°µà°¾à°Ÿà°¿ దీక్ష చేపట్టి విధులు చెయ్యాల్సిందే 

యాదవ ప్రకాశకుల కు రామానుజులు ఇచ్చిన ఆదేశం ఇదే. . .

రామానుజార్య దివ్యజ్ఞామ్ సాహి లోక

హితైషిణీ. . .. 

ఆలయాలు ఆచార్యుల అధీనంలోనే నడవాలి. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 22, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల ఆలయాల్లో సేవల /

 à°ªà°¨à°¿à°šà±‡à°¸à±‡ ప్రతి ఒక్కరూ కచ్చితంగా శ్రీ వైష్ణవ దీక్ష తీసుకోవాల్సిందేనని, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తచిన్న జీయర్ స్వామీ సూచించారు. ధర్మానుర్మాస దీక్షా

కార్యక్రమాల్లో భాగంగా అమెరికా లోహూస్టన్ లోని అష్టలక్ష్మి దేవాలయం లో  à°œà°°à±à°—ుతున్న వేడుకల్లో ఏడవ రోజున ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. à°ˆ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ ఆలయాలు ప్రభుత్వ అధీనం లో కాదు ఆచార్యుల అధీనంలో నడవాలి. ఆలయాలు సవ్యంగా నడిస్తేనే సమాజం సక్రమం గా నడుస్తుందన్నారు. ఒక ఆలయ పరిధిలో సమాజంలోని ఎన్నో

విభాగాల వారు సేవలు అందిస్తుంటారన్నారు. ప్రధానంగా తిరుమల ఆలయ నియమాలను యాదవ రాయలకు భగవద్రామానుజులు ఆదేశించిన నియమాలను తెలియచేసారు. ఆలయంలో ఎలా విధులు

నిర్వహించాలి, ఎవరెవరు ఏయే విధులు నిర్వహించాలి అనే విషయాన్నీ భగవద్రామానుజులే స్వయంగా పర్యవేక్షించి à°’à°• క్రమబద్దీకరణను ఏర్పాటు చేశారన్నారు. 

ఆలయాలు

ఆచార్యుల అధీనంలోనే నడవాలి. : . . . 

ఆలయాలు సమాజ శ్రేయస్సు కోసమే తప్ప అధికారుల మెహర్బానీ కోసం కాదన్నారు. ఆలయాలు కచ్చితంగా ఆచార్యుల ఆధీనంలోనే నడవాలని

రామానుజులు సూచించారన్నారు. అయితే దురదృష్టం కొద్దీ తిరుమల ఆలయంలో ఆచార్యుల అధీనం నుంచి అధికారుల చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. ఆలయాలు అధికారుల అధీనంలో ఉంటె

ఆచారాలు కేవలం అలంకారం ప్రాయంగానే ఉంటాయన్నారు. 

ఏ సాంప్రదాయ ఆలయంలో ఆయా ఆగమాలు ప్రకారమే దీక్ష వహించి విధులు చేపట్టాలన్నారు. అప్పుడే ఆ ఆలయం లో అర్చన,

ఆరాధనలు సక్రమంగా సాగుతాయన్నారు. à°’à°• ఆలయంలో మరొక సంప్రదాయం వారిని విధుల్లో పెడితే వీళ్ళు మొత్తం విధానాన్నే చెడగొడతారన్నారు. అందుకే రామానుజులు  à°ˆ ఆలయం లో సేవ

చెయ్యడానికి వచ్చే సిబ్బంది నుంచి కమిటీ ట్రస్ట్ బోర్డు వరకూ అందరూ కచ్చితంగా శ్రీనివాస దీక్ష చేపట్టాల్సిందేనని ఆదేశించారన్నారు. అయితే ఈ నాడు విధుల్లో ఉన్న

ఉద్యోగుల నుంచి బోర్డు పెద్దలవరకూ ఎన్నో ఆచారాలు పుట్టుకు వస్తున్నాయన్నారు. 
 
సర్వ దేశ దశాకాలే షవ్యాహిత పరాక్రమా .. . . రామానుజార్య దివ్యాజ్ఞమ్ వర్ధతాం

అభివర్ధతాం . . . . అని ప్రతి వైష్ణవ ఆలయంలోనూ, అన్ని దివ్యదేశాల్లోనూ పఠనం జరుగుతుందన్నారు. రామానుజులు ఆదేశించిన ప్రకారమే వైష్ణవ ఆలయ నిర్వహణ

సాగుతుందన్నారు. 

రామానుజార్య దివ్యజ్ఞామ్ సాహి లోక హితైషిణీ. . .. 

రామానుజులు ఏర్పరచిన సంప్రదాయం సమాజ హితం కోసమే నన్నారు. చైర్మన్ నుంచి చైన్ మాన్ వరకూ

అన్ని విధుల్లో ఉన్నవారూ కచ్చితంగా స్వామి దీక్షలోనే ఉండాలని, తిరుమల జీయర్ల నుంచి తిరుమల ఆచారాలకు భంగం కల్గించాము అని.. . ఆ దీక్షను స్వీకరించాలని తెలిపారు.

 à°‡à°¦à±‡ విధానం రాజమానుజులు సూచించారన్నారు. 

హిందూ ఆలయాల్లో హిందూ ధర్మం పై గౌరవం ఉన్నవారినే విధుల్లో నియమించాలి. అదే విధంగా ఇతర సంప్రదాయాల్లో ఆయా

సంప్రదాయాల వారినే నియమించాలన్నారు. లేని పక్షంలో అక్కడ జరిగే సంప్రదాయం చెడిపోతుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam