DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాపై కోపాన్ని రైతులపై చూపుతారా? బాబు మండిపాటు 

తుళ్లూరు మహాధర్నా లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు

రైతులకు సంఘీభావంగా జై అమరావతి అంటూ  à°¨à°¿à°¨à°¾à°¦à°¾à°²à±

చంద్రబాబు గా హామీ ఇవ్వలేదు....రాష్ట్ర సీఎం గా

హామీ ఇచ్చాను.

తప్పు జరిగితే శిక్షకు కూడా మేము సిద్ధం: మాజీ సి à°Žà°‚. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, డిసెంబ‌రు 23, 2019 (డిఎన్‌ఎస్‌) :

తనపై కోపంతో ప్రజల్ని ముఖ్యంగా రైతులను  à°¹à°¿à°‚సించడం తగదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సోమవారం రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు లో రైతుల

ధర్నా శిబిరాన్ని అయన సందర్శించారు. ఈ సందర్బంగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ జై అమరావతి అంటూ నినాదాలు చేసారు. అమరావతి రైతుల్ని ఈ పరిస్థితుల్లో

చూస్తాననుకోలేదని, సమాజ హితం కోసం ముందుకొచ్చిన త్యాగధనులు మీరు అని అన్నారు. అవస్థల్లో ఉన్న  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ నిలదొక్కుకోవాలనే ఉద్దేశం తో మీరు భూముల ఇచ్చేందుకు

నాడు ముందుకొచ్చారని, మీకందరికీ ఆమోదయోగ్యమైన ప్యాకేజి నాడు ప్రకటించానని తెలిపారు. ఇది ఓ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని మీరంతా భూములిచ్చారు , రైతులకు

న్యాయం కోసమే రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు అయితే రైతు దినోత్సవం రోజే రోడ్డు పై ఉండటం బాధ కలిగిస్తోందన్నారు.  à°…మరావతి లో రైతులు ప్రథమ పౌరులుగా ఉంటారని

ఆశించానని తెలిపారు. అమరావతి అభివృద్ధి కి నాడు చంద్రబాబు గా హామీ ఇవ్వలేదు....ప్రభుత్వం నుంచి సీఎం గా హామీ ఇచ్చానని తెలియచేసారు. ఎకరం భూమి ఇవ్వడానికి ముందుకు

రాని పతిస్థితుల్లో....33 వేల ఎకరాలు ఇచ్చారు. మీరంతా ధన్య జీవులన్నారు. ఒక్క ఇల్లు కట్టాలంటే మూడేళ్లు పడుతుంది. అలాంటిది ఒక రాజధాని నిర్మాణానికి ఎన్ని ఏళ్ళు

పడుతుందో వీళ్ళకి తెలియదా అని మండిపడ్డారు. 


రైతులకు న్యాయం జరగాల్సిందే

అమరావతి పై జగన్ ఎందుకు మాట తప్పి మడం తిప్పారు, కాళ్ళు కూడా వెనక్కి

తీసుకుని వెళ్లిపోయారన్నారు. 30 వేల ఎకరాలు కావాలని నాడు అని ఇప్పుడెందుకు 200ఎకరాలు చాలు అంటున్నారు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. 

ఇన్సైడ్

ట్రేడింగ్ పేరుతో  à°…మరావతి ని చంపేయటం అన్యాయం, దుర్మార్గం అని, ధైర్యం ఉంటే హైకోర్టు ద్వారా ఇన్సైడ్ ట్రేడింగ్ పై న్యాయ విచారణ జరిపించాలని, మేమూ విచారణకు

సహకరిస్తాం. తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధం అంటూ సవాల్ విసిరారు. 

జీఎన్ రావు ఎవరిని అడిగి నివేదిక రూపొందించారని, జీఎన్ రావ్ రిపోర్ట్ కి ఉన్న

విశ్వసనీయత à°Žà°‚à°¤ అని, ముఖ్యమంత్రి పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లుందఅన్నారు. 

జీఎన్ నివేదిక జగన్ నివేదిక తప్ప మరొకటి కాదన్నారు. 

విశాఖ

అభివృద్ధి కి తెలుగుదేశం వ్యతిరేకం కాదని, గతంలోనే తాము విశాఖ ను ఆర్ధిక రాజధాని గా ప్రకటించామన్నారు. అందుకే ఎన్నో పారిశ్రామిక సదస్సులు నిర్వహించామన్నారు.

 à°à°Ÿà±€ హబ్ à°—à°¾ విశాఖ అభివృద్ధి à°•à°¿ శ్రీకారo చుట్టామని, పర్యాటక కేంద్రంగా విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి à°•à°¿ పూనుకున్నాం కూడా తెలిపారు. 

సచివాలయం లేదా

అసెంబ్లీ అక్కడ పెడితే అది అభివృద్ధి కాదని, అసెంబ్లీ à°“ దగ్గర, సచివాలయం మరో ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam