DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లాను సుస్థిర, నేర రహితంగా తీర్చిదిద్దాలి : తమ్మినేని 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 24, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లాను సుస్థిరంగా,  à°¨à±‡à°° రహిత జిల్లాగా

రూపొందించే ధృక్పధాన్ని అలవరచుకోవాలని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్

జె.నివాస్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభాపతి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల

అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. బలహీన వర్గాలపై దాడులు చాలా హేయమైన చర్య అని, భవిష్యత్తులో బలహీన వర్గాలపై  à°¦à°¾à°¡à±à°²à± జరిగే పరిస్థితులు పునరావృత్తం కారాదని

అన్నారు.  à°ˆ దిశగా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అన్నారు.  à°ªà±Œà°°à±à°²à°‚తా ఆశావహ ధృక్పధంలో మెలగాలని, మంచి సమాజాన్ని భావితరాలకు అందించాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను

ఖచ్చితంగా అమలు చేయాలని, గ్రామాలలో ప్రజలకు మంచి కౌన్సిలింగ్ చేయడానికి కౌన్సిలింగ్ మెకానిజమ్ తో ముందుకు సాగాలని, చట్టాలపై మంచి ఆశావహధృక్పధంతో పనిచేయాలని

తెలిపారు. విజిలెన్స్ కమిటీ సమావేశాలను నిర్వహించే అవసరం రాని రోజులు రావాలని ఆశిస్తున్నామన్నారు.  à°…త్యాచారాలకు భరతవాక్యం పలకాలని,  à°’à°• మంచి నాగరిక సమాజాన్ని

స్ధాపించుకోవాలని అన్నారు. దిశ చట్టంపై స్పీకర్ల సమావేశంలో లోక్ సభ స్పీకర్ అభినందించి, మిగిలిన రాష్ట్రాలలో అమలు చేయాలని సూచించారని తెలిపారు. మంచి పాలన వైపు

అడుగులు వేద్దామని, అధికారులు, యంత్రాంగాన్ని గౌరవించాలని చెప్పారు. పౌర వ్యవస్ధ అత్యంత శక్తివంతమైనదని, బాధ్యతలు తెలుసుకుని విజ్ఞతతో మెలగాలని తెలిపారు. ఎస్.సి.,

ఎస్.à°Ÿà°¿. అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఎంక్వైరీలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  à°¸à±‹à°·à°²à± వెల్ఫేర్ గురుకులాలలో  à°¸à±à°Ÿà°¡à±€ సర్కిల్ ను ఏర్పాటు

చేస్తామన్నారు.  à°¬à°¾à°¬à±‚ జగ్జీవన్ రామ్, జ్యోతీరావు ఫూలే ఆడిటోరియాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో భూమి అభివృధ్ధి పథకం ద్వారా ఎస్.సి, ఎస్.టిలకు

జీవనోపాధి కలిగించాలన్నారు. ఎస్.సి., ఎస్.టి,లు డి-పట్టా భూములకు రుణ సదుపాయాన్ని పొందటానికి గాను డి.సి.సి.బి. లో మెంబర్ షిప్ పొందాలని ఈ విషయంపై వారికి అవగాహన

కలిగించాలని తెలిపారు. లక్ష్మీపేటలోని స్పెషల్ కోర్టు జడ్డిని కేసు పరిష్కారం కోసం నియమించడం జరిగిందని, జడ్డి రూమ్ కు మంచినీరు, మౌలిక సదుపాయాలను కల్పించాలని

ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టిందని తెలిపారు.  à°ªà±à°°à°¤à±€ నెల  30à°µ తేదీన అన్ని మండలాలలోను సివిల్ రైట్స్ డే ను

నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురుకులాలలో ప్రత్యేక అధికారులు రాత్రి బసలు చేసి విద్యార్ధులకు మంచి సదుపాయాలను కలిగిస్తున్నారని తెలిపారు.

        à°ˆ

సమావేశంలో  à°œà°¿à°²à±à°²à°¾ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సిఎం.సాయికాంత్ వర్మ, జిల్లా రెవిన్యూ

అధికారి బి.దయానిధి, శ్రీకాకుళం , పాలకొండ, టెక్కలి  à°°à±†à°µà°¿à°¨à±à°¯à±‚ డివిజనల్ అధికారులు యం.వి.రమణ, కుమార్, ఈట్ల కిశోర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు జి.రాజారావు,

యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్.మహాలక్ష్మీ, జిల్లా ఖజానాశాఖ ఉపసంచాలకులు జి.నిర్మలమ్మ, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కమల, గ్రామీణ నీటి

సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు, ఏపియంఐపి పథక సంచాలకులు జమదగ్ని, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పి.గోపాలకృష్ణ, డి.యస్.పిలు, కమిటీ సభ్యులు ఇతర

అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam