DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే : AP బీసి సంఘాల ఐక్య వేదిక

బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.. ..

ఆంధ్ర ప్రదేశ్ బీసి ఐక్య సంఘాల ఐక్య వేదిక తీర్మానం

విశాఖపట్నం, జూన్ 19, 2018 (DNS Online) : రాష్ట్రం లో సామాజికంగా

వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిందేనని ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంఘాల ఐక్య వేదిక తీర్మానం చేసింది. మంగళ వారం విశాఖ నగరం లోని ద్వారకానగర్ లో గల

ఒక హోటల్ లో జరిగిన ఐక్య సంఘాల ప్రతినిధుల సమావేశం లో ఈ తీర్మానం చేసినట్టు ఏ పీ బీసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు దువ్వారపు రామారావు తెలిపారు. బీసీ

వర్గాల ఐక్య వేదిక సమావేశం ముగిసిన తదుపరి నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ. . ఈ రాష్ట్రం లో గత దశాబ్దాలుగా తమకు తగినంత రాజకీయ ప్రాధాన్యత

ఇవ్వలేదని, అన్ని రాజకీయ పార్టీలు తమను కేవలం ఒక ఓటు బ్యాంకు లాగానే చూస్తున్నాయి తప్ప, తమ పాలనా సామర్ధ్యాన్ని గుర్తించలేదన్నారు. ఈ క్రమం లోనే రానున్న 2019

సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పరంగా ఎదగవలసిన అవసరాన్ని గుర్తించి విశాఖ లో ఈ ఐక్య సంఘాల సమావేశాన్ని నిర్వహించామన్నారు. గతం లో విజయవాడలో మొదటి సమావేశం

జరిగిందని, అక్కడ తీసుకున్న నిర్ణయాలను కూలంకషంగా చర్చించేందుకు రెండవ సమావేశం జరుగుతోందన్నారు. విజయవాడలో జరిగిన తొలి సమావేశం లో 12 మంది సమన్వయ కర్తలను

నియమించామని తెలిపారు. ఇంతవరకూ తమకు జరిగిన నష్టాన్ని ఇక కొనసాగించకూడదని, 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ సమాహారం ఎలా ఉండబోతోంది అనే అంశం పై

చర్చించేందుకు ఈ సమావేశం లో చర్చించామన్నారు. గత నాలుగు రోజులుగా ప్రధాన దేవాలయాల్లో ని నాయి బ్రాహ్మణులూ చేస్తున్న నిరసనలకు తాము అండగా నిలబడతామని, వారి కనీస

డిమాండ్లను నెరవేర్చాలి అని సంఘీభావం తెలియచేస్తున్నామన్నారు. తమ సంఘాల డిమాండ్లను అందరికీ తెలియచేసే విధంగా అతి త్వరలో బహిరంగ సభ జరపడం గాని, సర్వ సభ్య

సమావేశం నిర్వహించడానికి సమాయత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ బీసి ఐక్య సంఘాల ఐక్య వేదిక సమన్వయ కర్త గూడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ

విజయవాడలో జరిగిన మొదటి సమావేశం లో సుమారు రెండు వందల మంది కీలక ప్రతినిధులు తీసుకున్న నిర్ణయం ప్రకారం తీర్మానాలు చెయ్యవలసిన అవసరం ఉందని తెలిపారు. రానున్న

కాలం లో రాజకీయంగా ఎదగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తమకు ఆంధ్ర ప్రదేశ్ లోని ఆన్ని నియోజకవర్గాల్లోనూ తగినంత ఓటు బ్యాంక్ ఉందని, అధికంగా ఉన్న ప్రాంతాల్లో

తమకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ విధంగా ఇచ్చే వారికే తమ సంఘీభావం తెలియడం జరుగుతుందని తెలియచేసారు. జిల్లాల వారీగా సంఘాలను బలోపేతం చేసి, 2019 ఎన్నికల దృష్ట్యా రాజకీయం

గా ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది

కార్యక్రమం లో ఐక్య వేదిక సమన్వకమిటీ ప్రతినిధులు తుమ్మిడి రామ్ కుమార్, టి అర్జున రావు, విజయవాడ డిప్యూటీ మేయర్, ఐక్య వేదిక

ఉపాధ్యక్షులు, యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్, జివి రమణారావు, యు. కోటేశ్వర రావు, ఎం వివిఎస్ ఎం మూర్తి, ఎం వి రావు, యాచారయ్య, పి. ఆదినారాయణ, మహిళా

సమన్వయ కర్తలు వై. లక్ష్మి గిరిజ, రాధా కుమారి, తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam