DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారిక ప్రకటన కోసమే అందరి చూపు. .. 

విశాఖ లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు. .. 

మంత్రివర్గ సమావేశం విప్రోలోనేనా?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి):. . .

అమరావతి, డిసెంబ‌రు 25, 2019

(డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానులు ఉండవచ్చు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. అయితే

అధికారిక ప్రకటన మాత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం తర్వాతే ఉండనుంది. మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రకటన కోసమే ఎదురుచూస్తోంది. అయితే. . . మరో ప్రక్క కార్యాచరణ

రాజధాని కానున్న విశాఖనగరం లో ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. సాగర తీరంలోని ఐటి పార్కు మిలీనియం టవర్ 1 లో సచివాలయం రానుందని వార్తలు

ప్రకటితమవుతున్నాయి. అమరావతి లోని శాఖాధిపతుల నుంచి స్థానిక అధికారులకు భవనాల తరలింపు పై సమాచారమండినట్టు చర్చలు జరుగుతున్నాయి. 

మరో వైపు విశాఖ నగరం లోని

జాతీయ రహదారికి అనుకుని ఉన్న సత్యం సెంటర్ వద్ద గల విప్రో భవనాన్ని ప్రభుత్వం తీసుకోనుందని, అక్కడే ఈ నెల 27 న జరుగనున్న మంత్రి వర్గ సమావేశం జరుగుతుందనే వార్తలు

వెలువడుతున్నాయి.   

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam