DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు రాజధానుల పేరిట ముఖ చిత్రం మారింది.

రోడ్డెక్కిన అన్నదాతలకు మిగిలింది బారికేడ్ లేనా?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 25, 2019 (డిఎన్‌ఎస్‌) : మూడు రాజధానుల

ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆంధ్ర లో రాజకీయ చిత్రం మారిపోయింది. దీనిపై మూడు ప్రాంతాల రాజకీయ నేతల వారి మధ్య విభిన్న అభిప్రాయాలూ బయటపడుతున్నాయి. అమరావతి 
/> నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రస్తుతం నిరసనలు చేస్తున్నారు. తమను అన్ని రాజకీయ పార్టీలు చట్ట సభ సాక్షిగా మోసం చేశాయంటూ రోడ్డెక్కారు. 
ఈ నేపథ్యంలో ఈ

నెల 27 న విశాఖ లో జరుగనున్న మంత్రి వర్గ సమావేశం లో తీసుకునే నిర్ణయం రాష్ట్రంలో పూర్తి స్థాయి రాజకీయ చిత్రాన్ని ప్రకటింపచేస్తుంది. హైకోర్టు కర్నూల్ లో ఏర్పాటు

చేయడాన్ని బార్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకించింది. దీనికి నిరసనగా ఈ నెల 26 ,27 తేదీల్లో న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్టు

ప్రకటించేశారు. 

హైకోర్టు కాదు, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయల సీమకు రావాల్సింది ఒక్క హైకోర్టు మాత్రమే కాదు, ఏకంగా రాజధాని రావాలంటూ రాయల సీమకు చెందిన

 à°µà°¿à°µà°¿à°§ రాజకీయ పార్టీల నేతలు ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడం జరిగింది. 

అమరావతి అలెర్ట్ : . .. 

రాజధాని అమరావతిని తరలించవద్దని, మూడు రాజధానులు వద్దు అమరావతి

ముద్దు అని కొన్ని రోజుల నుండి అమరావతి రైతులు మరియు ప్రజలు నిరసనలు, దీక్షల చేపడుతున్న విషయం తెలిసిందే, దీని లో భాగంగా రేపు అనగా ది.26.12.19 న ప్రకాశం బ్యారేజి నందు

కొందరు తలపెట్టనున్న రూట్ మార్చ్, నిరసనలు మరియు ధర్నాలకు పోలీసుల నుండి ఎటువంటి అనుమతులు లేనందున అట్టి కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసు వారు గట్టి బందోబస్తు

ను ఏర్పాటు చేయనున్నారు, స్టాపర్ లు, బ్యారికేడ్ల తో వారిని నియంత్రించనున్నారు

అమరావతి రాజధాని లోని పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్

అమలులో ఉన్నందున చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకున్న లేక చట్ట వ్యతిరేక కార్యక్రమములు చేపట్టిన అట్టి వారి పై చర్యలు తప్పవని à°ˆ సందర్భముగా  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam