DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారం శాశ్వతం కాదని  గుర్తిస్తే మంచిది..! 

ఆంధ్ర సర్కార్ పై ‘క్యాట్’ ఆగ్రహం…!

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 26, 2019 (డిఎన్‌ఎస్‌) : ఐఆర్‌ఎస్‌ అధికారి, ఆర్థిక

అభివృద్ధి మండలి (ఈడీబీ) పూర్వ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌ సస్పెన్షన్‌పై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తనను సస్పెండ్‌ చేయడంతోపాటు తనపై ఏసీబీ/సీఐడీ దర్యా ప్తునకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను జాస్తి కృష్ణకిశోర్‌ ‘క్యాట్‌’లో సవాల్‌ చేసిన

నేపధ్యంలో ఆయన పిటిషన్‌ను ‘క్యాట్‌’ చైర్మన్‌ జస్టిస్‌ లింగాల నరసింహారెడ్డి, సభ్యులు బీవీ సుధాకర్‌à°² ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. à°ˆ సందర్భంగా

నరసింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

‘‘à°ˆ తరహా కక్షపూరితమైన విధానం సరికాదు. ఇదేం పరిపాలన? దురుద్దేశపూర్వకంగా, కక్షసాధింపు ధోరణిలో కొనసాగుతోంది.

కృష్ణకిశోర్‌ తప్పు చేశారంటున్నారు. ఏం తప్పు చేశారు? సస్పెండ్‌ చేసి ఏసీబీ/సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాల్సినంత పెద్ద తప్పా అది? ఆయనపై చేస్తున్న ఆరోపణలకు

సంబంధించి… ఆయన మాతృసంస్థ ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇచ్చారా? ప్రభుత్వాన్ని కొన్ని దుష్టశక్తులు నడిపిస్తున్నాయి. ఇలాగే పరిపాలన సాగితే భవిష్యత్తులో

పాలించడానికి ఏముండదనే విషయాన్ని గుర్తుంచుకొని మసలుకోవాలి’’ “à°’à°• బాధ్యతాయుతమైన వ్యక్తిగా చెబుతున్నా. à°ˆ తరహా దురుద్దేశంతో కూడిన, కక్షసాధింపు పరిణామాలు

ప్రభుత్వాన్ని సమస్యల్లోకి నెట్టేస్తాయి. స్పెషల్‌ సెక్రటరీ స్థాయి అధికారిపై డిప్యూటీ కలెక్టర్‌ ఫిర్యాదు చేయడమా? ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇలా అయితే రేపు

చీఫ్‌ సెక్రటరీ మీద à°’à°• ఎంఆర్‌వో ఫిర్యాదు చేస్తాడు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు పనిచేయడానికి వచ్చిన అధికారిపై వ్యవహరించి తీరేనా

ఇది? అయినా పీవీ రమేశ్‌ ఎవరు? ఈడీబీ సీఈవోపై చర్య తీసుకునేందుకు ఆయనకున్న అధికారాలేమిటి? అని ప్రశ్నించారు.

‘‘ఆరు నెలలుగా జీతం, పోస్టింగ్‌ ఇవ్వకుండా

ఖాళీగా ఉంచుతారా? కృష్ణకిశోర్‌కు హానిచేయాలన్న (సినిస్టర్‌) ఉద్దేశంతోనే à°ˆ తరహా విధానాలకు పాల్పడుతున్నట్లుగా ఉంది. ఇటువంటి దురుద్దేశంతో కూడిన కక్షసాధింపు

చర్యలు ప్రభుత్వానికి తలవంపులు తేవడంతోపాటు సమస్యల్లోకి నెట్టేస్తాయని వ్యాఖ్యానించారు. ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన జీవో అమలును నిలిపివేస్తూ గతంలో

ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి నెలాఖరు వరకు పొడిగించింది. కృష్ణకిశోర్‌కు చెల్లించాల్సిన బకాయి వేతనాలను రెండు వారాల్లోగా చెల్లించాలని తన ఉత్తర్వుల్లో

స్పష్టం చేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam