DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని అమరావతి లొనే ఉండాలి: ఎమ్మెల్యే భవాని

నా రాజధాని అమరావతి - సదస్సులో రాజమండ్రి లో ఎమ్మెల్యే 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్

రాజధాని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నా రాజధాని అమరావతి - సదస్సు నివహిస్తోంది. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం లోని ఆనంద రీజెన్సీలో జరిగిన సదస్సులో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాజధాని అమరావతి లొనే

ఉండాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులవల్ల ప్రజలు, ఉద్యోగులు పరిపాలనా... ఉపాధి... అభివృద్ధి పరంగా ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తంచేశారు. మాట తప్పడం... మడం తిప్పడమే...

లక్ష్యంగాముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారన్నారు. మా పిల్లలకు మేము గతంలో రాజధాని అంటే హైదరాబాద్ అనిచెప్పాము. రాష్ట్ర విభజన తరువాత అమరావతి అని చెప్పాము.

ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు. రాజధాని విషయంలో పిల్లలకు ఆలోచనలకు ఎలా సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని

ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాభివృద్ధి కుంటిపడడమే కాకుండా అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు

తరలిపోయాయని విచారం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అనే ఆలోచనే చాలా తప్పని... ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్

చేశారు.
à°ˆ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam