DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని పై మాట దాటేసారు- బీసీజీ నివేదిక తర్వాతే. . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌) : మూడు రాజధానుల నిర్ణయం పై రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించి మాట

దాటేసారు. ఇప్పడికే విశాఖ ను కార్యనిర్వహణ రాజధానిగా మారుస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పై తుది నిర్ణయం జనవరి 3 న అండ్ బీసీజీ నివేదిక తర్వాతే తీసుకుంటామని

రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన తెలిపారు. సీఎం

జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గ సమావేశం సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే:.
 
* 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు.
*

పంచాయతీ ఎన్నికల నిర్వాహణ కోసం రిజర్వేషన్ల ఖరారు.
* కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్ బోర్డుకు 4 ఎకరాలు కేటాయింపు.
* మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే

నిర్మిస్తుంది.

* 412 కొత్త 108 వాహనాలు కొనుగోలు. మార్చి 31లోపు కొనుగోలు చేసేందుకు రూ. 71 కోట్ల 48 లక్షలను నిధులు కేటాయింపు.

* 104 వాహనాలు (656) కొనుగోలు. ఇందుకు రూ. 60 కోట్ల 51

లక్షలతో నిధుల కేటాయింపు.
* వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలుకు కొత్త విధానం.

* రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలు గాను, 150 ఉప మార్కెట్

యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని నిర్ణయం.
* పసుపు, మిర్చీ, ఉల్లి, చిరుధాన్య పంటలకు ప్రతి సంవత్సరం మద్దతు ధర ముందే ప్రకటిస్తాం. ప్రభుత్వమే

కొనుగోలు చేస్తుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam