DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జై భారత్, జై మోడీ నినాదాలతో మారు మ్రోగిన విశాఖ  

దేశ భద్రత కోసమే పౌరసత్వ సవరణ అమలు 

భారతీయుల హక్కు అపాత్రదానం చెయ్యం : బీజేపీ  

సీఏఏ కు మద్దతు à°—à°¾ విశాఖ నగరంలో భారీ ర్యాలీ. . . 

(DNS రిపోర్ట్ : సాయిరాం

CVS , Bureau, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌): భారత దేశ పౌరుల భద్రత కోసం భారత ప్రధాని అమలు లోకి తీసుకు వచ్చిన సి ఏ ఏ చట్టం 2019 కు మద్దతు à°—à°¾ విశాఖ లో భారీ

ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ ర్యాలీ లో పాల్గొన్న దేశ భక్తులు, బీజేపీ ప్రతినిధులు జై భారత్, జై నరేంద్ర మోడీ అంటూ చేసిన నినాదాలతో విశాఖ నగరం

మారుమ్రోగిపోయింది. 
 à°¦à±‡à°¶ భద్రత కోసమే పౌరసత్వ సవరణ చట్టం అమలు లోకి తెచ్చినట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖ మాజీ MP డాక్టర్ కంభంపాటి హరిబాబు

తెలియచేసారు. శుక్రవారం ఈ బిల్లుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యవం లో విశాఖ నగరం లో భారీ యాత్ర నిర్వచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం వలన భారత దేశంలో

నివసిస్తున్న వివిధ మతాలకు చెందిన పౌరుల హక్కులకు ఎటువంటి భంగం కలుగదని, పౌరసత్వ సవరణ చట్టం వలన శరణార్థులను గుర్తించి వారికి పౌరసత్వం కల్పించడం జరుగుతుందని,

అలాగే à°ˆ చట్టం అమలు చేయడం వలన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న తీవ్రవాదులకు అడ్డుకట్ట వేయడం సులువవుతుందని తెలిపారు. 

పౌరసత్వ సవరణ చట్టం CAA - 2019 మద్దతుగా భారీ

ర్యాలీ జరిగింది. 27 వ వార్డు పరిధి లోని పాత జైలు రోడ్, ఉమెన్స్ కాలేజీ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కోర్ట్, CMR మాల్, PEN స్కూల్, డాబాగార్డెన్స్ మీదుగా పాత జైలు

రోడ్ లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద ముగిసింది.  

ర్యాలీ à°•à°¿ ముందుగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ పౌరసత్వ సవరణ చట్టం CAA - 2019  à°­à°¾à°°à°¤à±‌కు పొరుగున ఉన్న

పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా 2014 డిసెంబర్ 31లోగా వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పిస్తుందని

చెప్పారు.

నగర అధ్యక్షులు à°Žà°‚ నాగేంద్ర మాట్లాడుతూ à°ˆ చట్టం అమలు చేయడం వలన భారతదేశ సార్వభౌమాధికారానికి రక్షణ కలుగుతుందని తెలిపారు. 

ఈ ర్యాలీ లో

ఆరెస్సెస్ సంఘ చాలక్  à°¡à°¾à°•à±à°Ÿà°°à± విజయ్ గోపాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగి కాశీవిశ్వనాథరాజు, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు సురేంద్ర మోహన్, రాష్ట్ర

కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, నగర ప్రధాన కార్యదర్సులు ఏబీవీపీ  à°¨à°¾à°¯à°•à±à°²à± హరిప్రసాద్, జగదీష్, మూర్తి, వివిధ వర్గాలు, వివిధ మతాలకు చెందిన

ప్రజలు, యువత, కాలేజీ విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam