DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉగాది నాటికి పేదలందరికీ ఇల్లు : సీసీ ఎల్ ఏ నీరబ్ కుమార్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 28, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ళు పధకం ను అమలు

చేయనుందని, దానికి తగిన భూమిని సేకరించాలని రెవిన్యూ భూపరిపాలన చీఫ్ కమిషనర్ ) సీసీ ఎల్ ఏ ) నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ

లోని కలెక్టర్ కార్యాలయం లో ఆర్ డి ఓలు, స బ్ కలెక్టర్, హోసింగ్, డ్వామా అధికారులతో భూ సేకరణ, భూమి చదును చేయుట, లే అవుట్ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా

ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ భూ పట్టతో పాటు, రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా లో 313313 మంది లబ్ధిదారులు ఉన్నారని,

వారిలో అర్బన్ లో 105460 మంది, రూరల్ లో 207583 మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఇప్పడి వరకూ ప్రభుత్వ భూమి 1390 ఎకరాలు భూమి సేకరించి అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా

కలెక్టర్  à°®à±à°°à°³à±€à°§à°°à± రెడ్డి తెలిపారు. దీనిలో వ్యక్తిగత ఇళ్ళు  à°œà°¿ +1 ,జి+2 , జి+ 3  à°•à°¿ ఎకరానికి ఎన్ని ప్లాట్లు వస్తాయో చెప్పాలని కోరగా, రూరల్ లో సెంటున్నారా భూమి

ఇస్తామని, అర్బన్ లో అయితే à°’à°• సేంట్ ఇస్తామన్నారు. అదే విధంగా వ్యక్తిగత ఇళ్ళు 40 అవుతాయన్నారు.      
లబ్ధిదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇళ్ళు

నిర్మించుకున్నారని, వాటిని గుర్తించి, అర్హులైన వారిని అక్కడికి తరలించుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam