DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యోగ సాధన భారతీయ వేదం సంపదలో భాగం : జి ఎస్ ఎన్ రాజు 

విశాఖపట్నం, జూన్ 20 , 2018 ( DNS Online ) : యోగ సాధన భారతీయ వేదకాలం నాటిదని, అది భారతీయ ఆధ్యాత్మిక సంపదలో భాగమని సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.ఎస్.ఎన్.రాజు

అన్నారు. బుధవారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ( ఈ నెల 21 న ) పురస్కరించుకుని చేపట్టిన ఈ సమావేశం లో అయన మాట్లాడుతూ ఎన్నో మనోవేధనలకు, మందు లేని మనో వ్యాధులకు మాత్రమే యోగ సాధన

పరిశాకర మార్గం కాదని, మనిషి ఉత్తేజ భరితంగా తయారవ్వటానికి యోగ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల కాలం లో యోగ సాధన ఒక ఫ్యాషన్ గా మారిందని, అయితే ఇది అనాదిగా

భారతీయ వేదం కాలం నాటి నుంచి ప్రాచుర్యం లో ఉందన్నారు. విశ్వ వ్యాప్తంగా చాలా దేశాల్లో యోగ సాధన పై కొందరికి అవగాహన ఉందని, భారతీయ యోగ సాధకుల ప్రభావంతో ఆయా

దేశాల్లో కొందరు సాధకులు ఎందరికో మార్గదర్శకులు గా తయారయ్యారన్నారు. అయితే నాలుగేళ్ల క్రితం భారత దేశ ప్రధానమంత్రి గా భాద్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ మన భారతీయ

సంపద గా భావించే యోగ సాధనను అంతర్జాతీయంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని జూన్ 21 న ప్రపంచ దేశాలన్నింటి లోనూ యోగ సాధన చేసే విధంగా అంతర్జాతీయ యోగ

దినోత్సవాన్ని జరుపుకునేలా  à°•à±ƒà°·à°¿ చేశారన్నారు 

ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ సంస్థ విశాఖ ప్రతినిధి రామేశ్వరి మాట్లాడుతూ యోగ సాధనకు వయోభేదం, జాతి, మాట, లింగ

భేదం లేదని, దాన్ని అందరూ అభ్యాసం చెయ్యాలి అని కోరారు.
ఒత్తిడిని తగ్గించడమే కాకుండా దీర్ఘ కాలిక రోగాలను కూడా నయం చేస్తుందన్నారు. సహజ రాజ యోగం ద్వారా

ఆరోగ్యం, సంపద, సంతోషాన్ని పొందవచ్చని చెప్పారు. ఏకాగ్రత ను పెంచి మానసిక స్థైర్యాన్ని పెంపోందిస్తుందని, ప్రజల్లో ఆసక్తిని కలిగించేందుకు తరుచుగా శిక్షణ

కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 

విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ సంస్థ ఎన్నో ప్రజాపయోగా

కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహిస్తూనే ఉన్నారని వెల్లడించారు. అలాగే ఉచిత యోగ శిక్షణ ద్వారా ఎంతోమందికి

ఇతోధికంగా తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ యోగా సాధన చేయాలని ,మానసిక ఒత్తిడిల నుంచి బయట పడి సంతోషగా ఉండాలని అన్నారు.
విజేఎఫ్ కార్యదర్శి

ఎస్.దుర్గారావు మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడి తో వుండే మీడియా ప్రతినిధులకు కూడ యోగా తరగతులు నిర్వహిస్తున్న ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థకు కృతజ్ఞతలు

తెలిపారు. యోగా సాధన తో శరీర రుగ్మతల నుంచి బయట పడవచ్చని తెలిపారు. అనంతరం ఆచార్య జి.ఎస్.ఎన్. రాజును ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు

సత్యవతి, శాంతి తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam