DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకృష్ణ సాయుజ్యానికి ఉడిపి పీఠాధిపతులు విశ్వేశ తీర్ధ 

హైందవ ధర్మానికి అండదండ. . . పెజావర్ పీఠాధిపతులు 

గో రక్షణ ఉద్యమం, రామ జన్మ భూమి సాధనలో అగ్ర తాంబూలం, 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . .

.

విశాఖపట్నం, డిసెంబ‌రు 29, 2019 (డిఎన్‌ఎస్‌): దేశ విదేశాలలో హైందవ ధర్మ ప్రచారం లో తన వంతు కృషి చేసిన ఉడిపి ( కర్ణాటక) పెజావర్ పీఠాధిపతులు విశ్వేశ తీర్థులు ఆదివారం

శ్రీకృష్ణ సాయుజ్యానికి చేరారు. à°—à°¤ కొన్ని రోజులు అస్త్వత  à°¤à±‹ ఉన్న స్వామిజి స్థానిక మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  

ఎన్నో మత విధ్వాంసాలకు

గురైన అఖండ భారతావనిలో హైందవ ధర్మానికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సాక్షాత్తు పోరాటమే చేసిన స్వామిజి హైందవ ధర్మానికి అండదండ గా నిలిచారు. సర్వ హైందవ

అభివృద్ధికి , వారిని ఏక తాటి మీదకు తేవడానికి స్వామీజీ చేసిన కృషి మహోన్నతమైనది. నాడు తమిళనాడులో మీనాక్షీ పురం మతమార్పిడులకు, అరబ్బు ఆయిల్ ముఠాలకు

వ్యతిరేకంగా అయన చేసిన కృషిని ఎలా మరువగలం అని భక్త కోటి ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. 

విశ్వేశ తీర్థ  27- ఏప్రిల్ -1931 లో రామకుంజ గ్రామం లో శివల్లి మధ్వ

బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వనామం వెంకట్రామ. 1938 లో అత్యంత చిన్న ( ఏడు ఏళ్ళ వయసులో)  à°µà°¯à°¸à±à°²à±‹à°¨à±‡ వెంకటరామ లౌకిక జీవనం పై వైరాగ్యంతో సన్యాసం దీక్షను

స్వీకరించారు. విద్యా మాన్య తీర్ధ ( భాండార్కెరి మఠం), పలిమరు మఠం లోను విద్యాభ్యాసం చేసారు.  

స్వామిజి చేపట్టిన వివిధ కార్యక్రమాలు:  

పేద విద్యార్థులకు

సహాయ సహకారాలు అందించేందుకు అఖిల భారత్ మధ్వ మహా మండల్ (ABMM ) ను ప్రారంభించారు. వివిధ పవిత్ర క్షేత్రాల్లో ఎన్నో మఠాలను నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా బెంగుళూరు, హుబ్లీ,

ధార్వాడ్, బాగల్ కోట్ తదితర ప్రాంతాల్లో విద్యార్థుల కోసం ఉచిత వసతి గృహాలను నెలకొల్పారు. వీటిల్లో పేద విద్యార్థులకే అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ

కేంద్రాలు పూర్తిగా ఆధ్యాత్మిక, ఆశ్రమ  à°µà°¾à°¤à°¾à°µà°°à°£à°‚లోనే నిర్వహించబడుతున్నాయి. హైందవ ధర్మ సనాతన విధానాలు, ఆహార విధానాలను మాత్రమే అందిస్తుంటారు. 

రామ జన్మ

భూమి సాధనలో అగ్రతాంబూలం వీరికే దక్కుతుంది. విశ్వ హిందూ పరిషత్ తరపున ప్రాతినిధ్యం వహించి ఇతర సంప్రదాయవాదులు సైతం ఒప్పించి, ఆలోచింపచేసింది మహనీయులు

వీరు. 

గో రక్షణ కై నిరంతరం శ్రమించారు. గో రక్షణకై దేశ వ్యాప్త ఉద్యమాన్నే నిర్వహించారు. 

రాష్ట్ర స్వామిజి గాను, అత్యంత ప్రఖ్యాత సమాజ

సేవకులు, 

భారత రాష్ట్ర పతి రామనాద్ కోవింద్,  à°­à°¾à°°à°¤ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి దేశాధినేతలు సైతం స్వామిజి ని దర్శించి, ఆశీస్సులు పొందిన పీఠాధిపతులు విశ్వేశ

తీర్ధ. 

ఆలయాల పరిరక్షణ :

దేశం లోని దాదాపుగా అన్ని సంప్రదాయాల ఆలయాలతోనూ సత్సంబంధాలు కల్గియున్నారు. తిరుమల లో సైతం తలెత్తిన పలు కీలక, సున్నిత ఇబ్బంది

à°•à°° పరిస్థితులను సైతం కేవలం నోటి మాటతో పరిష్కరించిన మహనీయులు వీరు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam