DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మా గుళ్ల లో క్రైస్తవ ఉద్యోగులు ఉండకూడదు : పరిపూర్ణానంద

సంక్రాంతి తర్వాత సీఎం జగన్ ను కలుస్తాం. 

ఒప్పుకోకుంటే ఉద్యమం తప్పదు : సేవ్ టెంపుల్స్ వేదిక 

హిందూ గుళ్ళు ప్రభుత్వ అధీనం ఉండరాదు. 

బ్రిటిష్

వాడు చేసిన ద్రోహాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు : . .. 

రాజకీయ కబంద హస్తాల నుంచి గుళ్ళు వదలండి . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

తిరుపతి /

విశాఖపట్నం, డిసెంబ‌రు 29, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¹à°¿à°‚దూ ధర్మం పై నమ్మకం లేని వారు హిందూ ఆలయాల్లో ఉద్యోగాల్లో ఉండరాదని శ్రీపీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద

నిర్దేశించారు. ఆదివారం తిరుపతి క్షేత్రం లో సేవ్ టెంపుల్స్ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేల

సంఖ్యలో వివిధ ఆలయాల్లో పని చేస్తున్నక్రైస్తవులను తక్షణం హిందూ గుళ్ల నుంచి తొలగించి వేరొక చోటకి మార్చాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి ని సంక్రాంతి తర్వాత కలుస్తామని, దీనిపై సూచిస్తామని, తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోమని కోరతామన్నారు. ఆ డిమాండ్ ఒప్పుకొని పక్షంలో రాష్ట్ర

వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 

ప్రజా సంకల్ప యాత్రలో నేను ఉన్నాను. . . మీ మాట విన్నాను అనే ప్రతి గ్రామం లోనూ వాగ్దానాలు ఇచ్చారని, ఇప్పుడు అయన

ఉన్నారా లేదా, మా డిమాండ్లు విన్నారా లేదా అనే విషయం తేలిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైందవ ధర్మ అనుచరులు ఈ ఉద్యమం లో స్వచ్చందంగా పాల్గొనాల్సిందిగా

కోరారు. 

బ్రిటిష్ వాడు చేసిన ద్రోహాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు : . .. 

బ్రిటిష్ పాలకులు హిందూ ధర్మాన్ని చిన్నాభిన్నం చేసేందుకు చేసిన పనిలో భాగమే

దేవాదాయ శాఖా అంటూ ఒక గుదిబండను రాష్ట్ర ప్రజల పై పడేశారన్నారు. కేవలం హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉంటాయన్నారు. మరి క్రైస్తవ చర్చ్ లు, ముస్లింల

మసీదులు ప్రభుత్వం ఎందుకు తమ పరిధిలోకి తీసుకోలేదు చెప్పాలని డిమాండ్ చేసారు. ఆనాడు బ్రిటిష్ వాడు తన కుంచిత బుద్దిని బయటపెట్టుకున్నాడని, నేటికీ రాజకీయ

పార్టీలు అదే బుద్దిని ప్రకటించుకుంటున్నారన్నారు. 

ప్రజా పన్నులతో పోస్టర్లకు డబ్బులా? . . .

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులతో కేవలం

పోస్టర్లకు, ముల్లాలకు నెలవారీ జీతాలు ఇస్తామంటూ ఆదేశాలు జారీ చెయ్యడం అత్యంత దారుణమన్నారు. మరి హిందువుల గుళ్ళలో పనిచేసే అర్చకులకు దేవాదాయ శాఖా నుంచి కూడా

జీతాలు ఇవ్వడక పోవడం వీళ్ళ బుద్దిని బయట పెట్టిందన్నారు. 

రాజకీయ కబంద హస్తాల నుంచి గుళ్ళు వదలండి . .

రాష్ట్రం లో ఏ రాజకీయ పార్టీ అధికారం లోకి వచ్చినా

హిందూ గుళ్ళు, ఆలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. హిందూ ఆలయాలు రాజకీయ కబంద హస్తాల నుంచి విముక్తి కల్గించాలని డిమాండ్ చేసారు. హిందూ

ధర్మం పై నమ్మకం ఉన్నవారినే ఆలయాల్లో ట్రస్ట్ ల్లో ఉంచాలన్నారు. అంతేగాని క్రైస్తవులను హిందూ ఆలయాలలో అధికారుగాను, బోర్డు ప్రతినిధులుగా వేస్తె పూర్తిగా ఆలయం

భ్రష్టు పడుతుందన్నారు. తక్షణం క్రైస్తవ ఉద్యోగులు, ప్రతినిధులకు హిందూ గుళ్ల నుంచి బయటకు పంపాల్సిందేనని డిమాండ్ చేసారు. 

ఈ సభలో బీజేపీ రాజ్య సభ సభ్యులు

సుబ్రమణ్య స్వామి, సేవ్ టెంపుల్స్ ప్రతినిధులు, హైందవ ధర్మ ప్రచారకులు రాధామనోహర్ దాస్ తదితరులు పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam