DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మెట్రో రైలు హుష్ కాకి. . . మళ్ళీ మొదలు. .. 

బిడ్‌ రద్దు - కాలయాపనే కారణమా? మళ్ళీ డిపిఆర్ నుంచి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌): ఎంతో ప్రతిష్టాత్మకంగా

మొదలైన  à°µà°¿à°¶à°¾à°–పట్నం మెట్రో ప్రాజెక్ట్ మళ్ళీ మొదటికే వచ్చింది. à°—à°¤ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విశాఖపట్నం మెట్రో రైల్ బీడ్ ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం

రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్షియం సింగిల్‌ బిడ్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నూతన డీపీఆర్‌ సిద్ధం చేసేందుకు కొత్త

కన్సెల్టెంట్‌కు బాధ్యతలు అప్పగించింది. ఓపెన్‌ టెండర్‌ ద్వారా విశాఖ మెట్రోకు కొత్త టెండర్‌కు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం à°ˆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు టెండర్ల ప్రక్రియ నిర్వహణకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. à°ˆ ప్రాజెక్ట్ తదుపరి కార్యాచరణ ను మొదలు పెట్టకుండా

ఇంతకాలం ఆలోచనలు, ప్రతిపాదనలు, డిజైన్లలో మార్పులు, డీపీఆర్‌లో చేర్పులతోనే కాలయాపన చేయడం తో ప్రభుత్వం à°ˆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

2015–16 ఆర్థిక

సంవత్సర ప్రారంభంలో విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు à°ˆ బాధ్యతల్ని అప్పటి ప్రభుత్వం అప్పగించింది.  à°®à±‚డు

కారిడార్లతో డీపీఆర్‌ని సిద్ధం చేశారు. మొత్తం రూ. 12,500 కోట్లు ప్రాజెక్టుగా డిజైన్‌ చేశారు. 2016–17లో à°ˆ ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం

నిర్ణయించింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సొంతంగానే ప్రతిప్రాజెక్టూ చేపట్టిన నేపథ్యంలో పీపీపీ విధానంలోకి వెళ్లడంతో సదరు కార్పొరేషన్‌

పక్కకు తప్పుకుంది. దీంతో à°ˆ బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)à°•à°¿ అప్పగించిన విషయం తెలిసిందే.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam