DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెన్షన్ పథకాల్లో 2 లక్షల మందిని చేర్చాలి: కలెక్టర్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (  
పి ఎం ఎస్వైఎం ), జాతీయ

పెన్షన్ పధకం ( ఎన్పిఎస్ ) లో అసంఘటిత రంగంలోని కార్మికులు అందరిని చేర్చాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి శ్రమ

యోగి మాన్ ధన్ (ఎస్వైఎం), ప్రధానమంత్రి లఘువ్యాపారి మాన్ ధన్ (ఎన్పిఎస్) కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పిఎం ఎస్వైఎం,

ఎన్పిఎస్ లో కనీసం 2 లక్షల మందిని చేర్చడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ వేతనదారులు, దుకాణాలలో పనిచేస్తున్న కార్మికులు, భవన నిర్మాణ

కార్మికులు, వీధి వ్యాపారాలు చేస్తున్నవారు తదితర అసంఘటిత కార్మికులను ఇందులో చేర్చాలని తద్వారా వారికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అసంఘటిత కార్మికులను

అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జనవరి 3వ తేదీన సంబంధిత రంగాల వారితో అవగాహన సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు బాపూజీ కళామందిర్ లో జరపాలని ఆదేశించారు.

పి à°Žà°‚ ఎస్వైఎం, ఎన్పిఎస్ లో చేరిన  à°’à°• వ్యక్తికి 60 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత నెలకు రూ.3 వేల వరకు పింఛను లభిస్తుందని చెప్పారు. à°ˆ పింఛను వారి బ్యాంకు ఖాతాలలో జమ

చేయడం జరుగుతుందని తెలిపారు. పి ఎం ఎస్వైఎంలో వీధి వ్యాపారాలు చేసేవారు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చర్మకారులు, ఇండ్లలో

పనిచేసేవారు అర్హులని చెప్పారు. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగి, నెలకు రూ.15 వేలు లోపు ఆదాయం కలిగిన వారు అర్హులని అన్నారు. ఎన్పిఎస్ కు స్వయం ఉపాధిదారులు, దుకాణ

యజమానులు, రిటైల్ వ్యాపారులు, రైస్ మిల్ యజమానులు, వర్క్ షాప్ యజమానులు, కమిషన్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, చిన్న హోటల్ యజమానులు, హోటల్స్, రెస్టారెంట్, ఇతర

లఘువ్యాపారులు అర్హులని చెప్పారు. ఆదాయపు పన్ను చెల్లించనివారు, వార్షిక టర్నోవర్ రూ.1.50 కోట్ల లోపు వుండి, 18 నుండి 40 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు , జాతీయ పింఛను

పథకంలో నమోదు కానివారు ఈ పథకానికి అర్హులని వివరించారు. ఈ పథకం ఎల్.ఐ. సి ద్వారా అమలు జరుగుతుందని చెప్పారు. లబ్దిదారు మొదటి ప్రీమియంను నగదుగా చెల్లించాలని, తరువాత

ప్రీమియంలు బ్యాంకు ఖాతా నుండి నేరుగా చెల్లింపు జరుగుతుందని చెప్పారు. లబ్దిదారుని వయస్సు అనుగుణంగా నెలవారీ ప్రీమియం రూ.55 నుండి రూ.200 వరకు చెల్లించాలని

పేర్కొన్నారు. మీ సేవ కేంద్రం ద్వారా పథకంలో చేరవచ్చని అన్నారు. నమోదు చేసుకున్న లబ్దిదారులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్, సెల్ ఫోన్ నంబరు వివరాలు

ఇవ్వాలని పేర్కొన్నారు. పింఛనుదారు మరణిస్తే జీవిత భాగస్వామికి పింఛను చెల్లించడం జరుగుతుందని అన్నారు. 

ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమీషనర్ ఎస్డివి

ప్రసాద రావు, సహాయ కమిషనర్ సి హెచ్.పురుషోత్తం, ఆహార భద్రతా శాఖ సహాయ కంట్రోలర్ కె. వి.రత్నం, తనిఖీ అధికారి కూర్మనాయకులు, తూనికలు కొలతలు శాఖ సహాయ కంట్రోలర్

ఎస్.విశ్వేశ్వర రావు, డీఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam