DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందనతో సమస్యలకు తక్షణ పరిష్కారం : మంత్రి ధర్మాన 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన

స్పందన కార్యక్రమం ద్వారా ఆర్జీదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం

కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఫిర్యాదుల విభాగంలో స్పందన కార్యక్రమాన్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ జె.నివాస్

నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీదారులు తెచ్చిన పలు ఆర్జీలను మంత్రి, కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ స్పందనలో వచ్చిన వినతులను

ప్రాదాన్యత క్రమంలో తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సోంపేట మండలం మాల గోవిందపురం నుండి రౌలో కృష్ణచంద్ర ఆర్జీని మంత్రికి అందజేస్తూ

తమ గ్రామం మండలపరిషత్ ప్రైమరీ స్కూలు నకు చెందిన సర్వే నెం. 80-3లోని 0.98 సెంట్ల స్థలం ఆక్రమించడమే కాకుండా కురా గౌడో పేరున వ్రాయించుకున్నారని, ఇదేకాకుండా ఇతర

ప్రభుత్వ స్థలాలను కూడా ఆక్రమించుకున్నందున బాధ్యులపై చర్యలు తీసుకొని, స్థలాలు లేని నిరుపేదలకు పంపిణీచేయాలని కోరారు. కొత్తూరు మండలం నేరడి నుండి తమ్మినేని

నారాయణరావు ఆర్జీ ఇస్తూ నిర్వాసిత గ్రామమైన నేరడికి పి.డి.ఎఫ్ క్రింద సర్వేచేసి నివాసగృహాలకు నష్టపరిహారం చెల్లించారే గాని ఎటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని

వర్తింపచేయలేదని,రావాలసిన ప్యాకేజీలు, ఇండ్లస్థలాలను మంజూరుచేయలేదని ఫిర్యాదుచేసారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. సోంపేట నుండి నర్తు భైరి ఆర్జీ

సమర్పిస్తూ తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకొని తనకు తగు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసారు. ఆమదాలవలస మండలం అక్కులపేట నుండి సీపాన

వెంకటరమణ ఆర్జీ ఇస్తూ తమ ఇంటి ముందు గల రోడ్డు, కాలువ పూర్తిగా పాడైపోయి పిచ్చి మొక్కలు పేరుకుపోయాయని, దానివలన నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని

ఫిర్యాదుచేసారు.వంగర మండలం శ్రీహరిపురం నుండి ఆర్.సీతాన్నాయుడు  à°†à°°à±à°œà±€à°¨à°¿ ఇస్తూ  à°µà°¾à°°à°¸à°¤à±à°µà°‚à°—à°¾ తన తండ్రి నుండి సంక్రమించిన భూమికి అడంగళ్, వన్ బి కావాలంటూ à°—à°¤

ఆరేళ్లుగా కోరుతున్నప్పటికీ ఇంతవరకు మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు.నరసన్నపేట మండలం మాకివలస నుండి పూలసేరి నారాయణమ్మ ఆర్జీని సమర్పిస్తూ తాను చాలా

నిరుపేదనని, తనకు ఇంటిస్థలం గాని, ఇల్లుగాని లేదని కావున తనకు గృహాన్ని మంజూరుచేయాలని కోరారు. నగరపాలక సంస్థ పరిధిలో గల గూనపాలెం చెరువుగట్టు సర్వే నెం. 204లో గృహం

నిర్మించుకోవడం జరిగి ఐదేళ్లు అయిందని, దానికి సంబంధించి పట్టా కొరకు ఈ ఏడాది అక్టోబర్ 14న దరఖాస్తు చేసుకున్న, ఇంతవరకు ఎటువంటి సమాచారం అందించలేదని ఫిర్యాదు

చేసారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు నుండి కింతాడ శారద ఆర్జీ ఇస్తూ తనకు చెందిన జిరాయితీ స్థలాన్ని బంజరు భూమిగా చూపుతున్నారని, దానిపై చర్యలు

తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. రణస్థలం మండలం సిహెచ్.రాజాం నుండి దల్లి కనకరాజు ఆర్జీని సమర్పిస్తూ తాను కూలీనని, తనకు ఎటువంటి ఇల్లు లేదా స్థలం గాని లేదని,

కూలీపనుల నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లడం అనివార్యమయినందున వాలంటీర్లు ఇంటి స్థలాల జాబితాలో తన పేరు నమోదుచేయలేదని, కావున తన పేరును నమోదుచేయాలని కోరారు. 
  

 à°ˆ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ à°¡à°¾. కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ à°Ž.భార్గవతేజ, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక

సంచాలకులు ఎ.కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, రెవిన్యూ డివిజనల్ అధికారి యం.వి.రమణ, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక

సంచాలకులు జి.రాజారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం.చెంచయ్య, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు డా. వి.వి.కృష్ణమూర్తి, గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక

ఇంజినీర్ à°Ÿà°¿.శ్రీనివాసరావు, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు కె.జీవన్ బాబు,  à°‡à°¤à°° జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam