DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధాన్యం కొనుగోళు ముమ్మరం కావాలి – జిల్లా కలెక్టర్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లాలో  à°§à°¾à°¨à±à°¯à°‚ కొనుగోళు ముమ్మరం కావాలని జిల్లా కలెక్టర్

జె నివాస్ అధికారులను ఆదేశించారు. సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళు, మిల్లింగుపై సంబంధిత అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోళు పలు మండలాల్లో పూర్తి స్ధాయిలో ప్రారంభం కాలేదని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని ధాన్యం కొనుగోళు కేంద్రాల్లో

ధాన్యం కొనుగోళు వెంటనే ప్రారంభించి రైతులకు దోహదకారిగా నిలవాలని సూచించారు. జిల్లాలో నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఇందులో

భాగంగా కొనుగోళు సమయంలో ఆ విధానాలు పాటించాలని అన్నారు. నాణ్యమైన బియ్యం ప్రజలకు సరఫరా చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని అందుకు అనుగుణంగా పక్కాగా ఉండాలని స్పష్టం

చేసారు. ప్రతి కొనుగోళు కేంద్రంలో తేమ శాతం పరిశీలించే యంత్రాలతో సహా అన్ని పరికరాలను ఏర్పాటు చేసామని కలెక్టర్ పేర్కొంటూ కొన్ని మిల్లుల వద్ద సక్రమంగా

పనిచేయని తేమ శాతం పరిశీలించే యంత్రాలు ఏర్పాటు చేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని

హెచ్చరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళు చేయడం లేదనే అపోహలో రైతులు ఉన్నారని దీనిని తొలగించాలని ఆయన స్పష్టం చేసారు. సంక్రాంతి నాటికి 2.25 లక్షల మెట్రిక్ టన్నుల

ధాన్యం కొనగల సామర్ధ్యం ఉందని కలెక్టర్ అన్నారు. ధాన్యం రవాణా ఛార్జీలు సైతం తక్షణం చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి రైస్ మిల్ లో నాణ్యమైన బియ్యం

పరిశీలనకు తగిన పరికరాలు ఉన్నప్పుడు మాత్రమే మిల్లును పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఒడిషా ధాన్యం తీసుకువస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేసారు.

సమస్యలు ఉంటే కలెక్టర్ కార్యాలయంలోగల కంట్రోల్ రూమ్ కు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళు, మిల్లింగు తక్షణం ప్రారంభం కావలని స్పష్టం చేసారు.

రైతులకు మద్దతు ధర చెల్లింపులో ఎటువంటి లోపాలు ఉండరాదని ఆయన ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకం లేనివారికి సాగు ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నామని

కలెక్టర్ అన్నారు. 1075 à°°à°•à°‚ ధాన్యాన్ని నాణ్యమైన బియ్యం రకంలోకి తీసుకు రాలేదని చెప్పారు. 
    à°µà±à°¯à°µà°¸à°¾à°¯ మిషన్ సభ్యులు గొండు రఘురామ్ మాట్లాడుతూ కొనుగోళు

కేంద్రాల్లో పట్టాదారు పాసు పుస్తకం అడుగుతున్నారని, కౌలు రైతులకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. 
    à°­à°¾à°°à°¤ ఆహార సంస్ధ డివిజనల్ మేనేజర్ à°¡à°¿.వరప్రసాద రావు

మట్లాడుతూ గిడ్డంగులలో నిల్వ సామర్ధ్యం ఉందని చెప్పారు. 
రైస్ మిల్లర్ల రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 1075 రకం ధాన్యంలో కొంత సమస్య ఉందన్నారు.

జిల్లాలో ధాన్యం మంచి నాణ్యమైనదని చెప్పారు. జిల్లాలో 345 మిల్లులు ఉన్నాయని, 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పంట దిగుబడి అవకాశం ఉందని పేర్కొన్నారు. నాణ్యమైన బియ్యం

ప్రక్రియలో మిల్లింగు చేయుటకు రాయితీ ఇప్పించాలని కోరారు. భారత ఆహార సంస్ధ గిడ్డంగులు అందుబాటులో ఉంచితే తక్షణం మిల్లింగు చేయగలమని చెప్పారు. 
ఈ సమావేశంలో

జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఎం.వి.రమణ, ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణారావు, జిల్లా

సరఫరా అధికారి జి.నాగేశ్వర రావు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా సహకార

అధికారి కె.వెంకట రావు, సహకార శాఖ అధికారులు మురళీకృష్ణ, రమణ మూర్తి, మార్కెటింగు శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాస రావు, జిల్లా మిల్లర్ల అధ్యక్షులు వెంకటేశ్వర

రావు (వాసు), పి.ఆర్.ఓ లాడే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam