DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి . . . 

గొంతు మారింది..! విషయం అదేనా..?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరో

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేరినట్టు తెలుస్తోంది... మంత్రి వెల్లంపల్లి వెంట సీఎం వైఎస్ జగన్‌ దగ్గరకు వెళ్లిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి

గిరిధర్ రావు... సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నట్టు సమాచారం. అయితే, సీఎంను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మద్దాలి గిరి... నియోజకవర్గ సమస్యలపై

సీఎంను కలిశానని చెబుతున్నా... మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడారు. సీఎం జగన్, వైసీపీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు.

వైసీపీ

సర్కార్ సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే మద్దాలి గిరి... తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే జగన్ ను కలసినట్లు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో సీఎం

జగన్ తీసుకున్న నిర్ణయం సరైందన్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయని..

గుంటూరు నియోజకవర్గానికి రూ. 25 కోట్లు పాతబకాయిలు వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మద్దాలి గిరి తెలిపారు. అయితే, మద్దాలి గిరి వ్యాఖ్యలు

చూస్తుంటే... గతంలో వల్లభనేని వంశీ కూడా చేసిన కామెంట్లు గుర్తుకు వస్తున్నాయి. సీఎంను కలిసిన వెంటనే టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని.. ఆ తర్వాత చంద్రబాబును,

లోకేష్‌ను టార్గెట్ చేశారు... అధికారికంగా వైసీపీలో చేరకపోయినా... ప్రభుత్వ పథకాలను సపోర్ట్ చేశారు.. సీఎం జగన్‌ వెంట కలిసి నడుస్తానని ప్రకటించారు. ఇక, అసెంబ్లీలో

తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను అసెంబ్లీ సాక్షిగా కోరడం.. ఆయనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించడం జరిగిపోయాయి. ఇప్పుడు

మద్దాలి గిరి విషయంలోనూ అదే జరుగుతుందా? అనే చర్చ సాగుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam