DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిశ చట్టం అమలు దిశగా ఏపీ ప్రభుత్వ చర్యలు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన దిశ చట్టం అమలు కోసం 87 కోట్ల రూపాయలను కేటాయిస్తూ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు.  à°®à°¹à°¿à°³à°²à±, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు. à°ˆ నిధులను రాష్ట్రంలో

మహిళా పోలీసుస్టేషన్ల ఉన్నతీకరణ, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల బలోపేతం... ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, దిశ కాల్‌సెంటర్‌, యాప్‌à°² కోసం

వినియోగించనున్నారు. 

విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్‌ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న

రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు  à°¡à°¯à°²à±‌ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి దాన్ని

దిశ కంట్రోల్‌ రూంగా పిలవనున్నారు. దిశ యాప్‌ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నారు. 

ప్రతి బస్‌స్టాప్‌ సెంటర్‌కు à°’à°• మహిళా ఎస్సై పోస్టు మంజూరు

చేశారు. ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్‌ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. ప్రత్యేక పబ్లిక్

ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam