DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలబడతాం: మంత్రి అవంతి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల కు మెరుగైన జీవితం, మరిన్ని అవకాశాలు

కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.

గురువారం నాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని కాన్వకేషన్

హాల్ నందు విభిన్న ప్రతిభావంతుల కు ఉపయుక్తమైన పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ కార్పొరేట్

సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.77.80 లక్షల విలువైన పరికరాలను 517 మందికి

అందజేస్తుందని తెలిపారు. ఇందులో 94 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ లు, 57 ట్రై సైకిల్ లు, 61 వీల్ చైర్లు, 154 ఎమ్మార్ కిట్ లు , 276 డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్, 84  à°•à±à°°à°šà±†à°¸à± లు ఉన్నాయని

తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ఆత్మస్థైర్యం కలిగించేలా, తాము ఎవరికి తీసుకోమని అనిపించేలా ప్రభుత్వం వారికి అండదండగా ఉంటుందని తెలిపారు.

à°ˆ

కార్యక్రమంలో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,  à°†à°°à±à°Ÿà°¿à°«à°¿à°·à°¿à°¯à°²à± లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అధికారి రాజేష్, విభిన్న

ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam