DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధాన్యం కొనుగోలు చేయకుంటే చర్యలు తప్పవు : జెసి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లాలో రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయని

కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు హెచ్చరించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలోని

రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయనివారిపై చర్యలు తీసుకుంటామని  à°¡à°¯à°²à± యువర్ జె.సి కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్  à°¸à±à°ªà°·à±à°Ÿà°‚ చేసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్

కార్యాలయ సమావేశ మందిరంలో డయల్ యువర్ జె.సి కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు నిర్వహించారు.  à°ˆ కార్యక్రమానికి 20 వినతులు అందాయి. à°ˆ కార్యక్రమంలో

పలు ప్రాంతాల నుండి రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమస్యలను జె.సికు వివరించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

పలాస మండలం లక్ష్మీపురం నుండి బి.సింహాచలం

మాట్లాడుతూ పలాస ,టెక్కలిలో గల మిల్లర్లు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. వాళ్లు ఒడిషా, పశ్చిమ బెంగాల్ నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని

ఫిర్యాదు చేసారు.

రేగిడి ఆమదాలవలస మండలం బూరాడ నుండి వి.భుజంగరావు ఫోన్ చేసి మాట్లాడుతూ మా దగ్గర ఉన్న ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు

చేసారు.

వంగర మండలం మడ్డువలస నుండి యస్.కృష్ణారావు మాట్లాడుతూ మిల్లర్లు ధాన్యాన్ని పంపించండి. కాని నూకలు పంపించవద్దు అంటున్నారని, రూ.1,300/-లకు ధాన్యం

ఇవ్వమంటున్నారని ఫిర్యాదు చేసారు.

పాలకొండ మండలం పొట్టిన నుండి యస్.సంగంనాయుడు మాట్లాడుతూ తమ వద్ద ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయడం లేదని, మిల్లర్లు రూ.1,350/-లకు

అడుగుతున్నారని ఫిర్యాదు చేసారు.

ఎచ్చెర్ల మండలం రామజోగిపేట నుండి ఎ.అసిరోడు మాట్లాడుతూ తమ వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవడంలేదని ఫిర్యాదు

చేసారు.

నరసన్నపేట మండలం ఉర్లాం నుండి ఆర్.జ్యోతి ఫోన్ చేసి మాట్లాడుతూ మా దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేసారు.

శ్రీకాకుళం రూరల్

మండలం రామకృష్ణపురం నుండి ఎ.వెంకటరమణ మాట్లాడుతూ తమ వద్ద 1075 ధాన్యం ఉందని, దానిని ఎవరూ కొనుగోలు చేసుకోవడం లేదని ఫిర్యాదు చేసారు.

మందస మండలం బాలిగాం నుండి

జి.విక్రమ్ మాట్లాడుతూ తమ ధాన్యాన్ని ఏ కొనుగోలు కేంద్రం వారు కూడా తీసుకోవడం లేదని ఫిర్యాదు చేసారు.

వీరఘట్టం మండలం చిట్టిపూడివలస నుండి జి.హరికృష్ణ

మాట్లాడుతూ తమ మండలంలోని ధాన్యాన్ని ఏ కొనుగోలు కేంద్రం వారు కూడా కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేసారు.

రాజాం మండలం అంతకాపల్లి నుండి యల్.కాంతారావు

మాట్లాడుతూ తమ వద్ద 70 బస్తాల ధాన్యం ఉందని, కాని మిల్లర్లు ఎవరూ తమ ధాన్యాన్ని తీసుకోవడం లేదని ఫిర్యాదు చేసారు.

ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు,

డెప్యూటీ తహశీల్ధారులు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam